అపజయం శాశ్వితం కాదు: సోనియా గాంధీ

ఎన్నికలు ప్రక్రియ మొదలైన ప్రతీసారి కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక అనూహ్యమైన వ్యూహంతో ముందుకు వస్తుంది. బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ , నితీష్ కుమార్ లతో పొత్తులు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వామపక్షాలతో పొత్తులు, తమిళనాడులో విజయావకాశాలున్న డిఎంకెతో పొత్తులు అందుకు చక్కటి ఉదాహరణలు. కానీ దాని దురదృష్టమో లేదా ఎక్కడో లెక్క తప్పడం వలనో తరచూ ఎదురుదెబ్బలు తింటూ ఉంటుంది.

అలాగే ఎన్నికలలో ఓడిపోయిన ప్రతీసారి ‘అందుకు రాహుల్ గాంధీది ఏమాత్రం బాధ్యత కాదు…ఆయననే పార్టీ అధ్యక్షుడుగా నియమించాలి..’వంటి మాటలు కూడా వినిపిస్తుంటాయి. ఈసారి కూడా దిగ్విజయ్ సింగ్ వంటి వాళ్ళు పార్టీ ప్రక్షాళన..రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు వంటి రొటీన్ డైలాగులు అన్నీ వినిపించేశారు. ఆ తరువాత కార్యక్రమం నాలుగు ఓదార్పు మాటలు చెప్పుకోవడం. అంతే ఆ తరువాత మళ్ళీ అంతా రొటీన్ ఆలోచనలు..కార్యక్రమాలే. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆ ఆఖరి తంతు కూడా ఇవ్వాళ్ళ ముగించేశారు.

ఆమె డిల్లీలో పార్టీ నేతలని,కార్యకర్తలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ “సిద్ధాంతాలను, నైతిక విలువలను పక్కనబెట్టి సాధించిన గెలుపు శాశ్వితం కాదు. అలాగే సిద్ధాంతాలు, విలువలని నమ్ముకొన్న వారి ఓటమి కూడా శాశ్వితం కాదు. అడ్డుదారిలో విజయం సాధించిన వారు ఎంత వేగంగా పైకి వస్తారో అంతకంటే వేగంగా పతనం అవుతుంటారు. కానీ నైతిక విలువలని నమ్ముకొన్నవారు తాత్కాలికంగా నష్టపోవచ్చేమో గానీ మళ్ళీ తప్పకుండా విజయం సాధిస్తారు,” అని అన్నారు.

బహుశః అసోంలో భాజపా, కేరళలో వామపక్షాల విజయం అనైతికమని ఆమె అభిప్రాయం కావచ్చు. కాంగ్రెస్ గెలిస్తేనే అది నైతికం, ప్రజాస్వామ్య విజయం లేకుంటే అనైతికం, అవినీతిమయం అని ఆమె భావిస్తున్నట్లే మిగిలిన పార్టీలు కూడా భావిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్, భాజపాలతో సహా అన్ని పార్టీలు ఆ తానులో ముక్కలే. ఎన్నికలలో గెలిచేందుకు అవి ఎంతకైనా దిగజారడానికి సిద్ధం. తమిళనాడులో మూడు కంటైనర్ల నిండా సుమారు 500 కోట్లు పట్టుబడింది కానీ అది ఏ పార్టీకి చెందిందో ఇంతవరకు బయటపడలేదంటే, రాజకీయాలలో అవినీతి ఏ స్థాయిలో జరుగుతోందో ఊహించుకోవచ్చు. కనుక పార్టీ ఏదైనా సరే సిద్ధాంతాలు, నీతి కబుర్లు వల్లెవేసుకోవడానికే తప్ప ఆచరణకి పనికిరావని ప్రతీ ఎన్నికలు రుజువు చేస్తూనే ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close