క‌త్తి క‌థ‌.. రూ.20 ల‌క్ష‌లేనా?

చిరంజీవి 150వ సినిమా క‌థ కోసం ఎన్ని ప‌డిగాపులు ప‌డ్డారో? స‌రైన క‌థ దొర‌క‌లేదు, దొర‌క‌లేదు అంటూ యేళ్ల‌కు యేళ్లు కాల‌యాప‌న చేశారు. ఓ ద‌శ‌లో రామ్‌చ‌ర‌ణ్ అయితే.. ‘డాడీకి స‌రిప‌డా క‌థ తీసుకొస్తే కోటి రూపాయ‌లిస్తా’ అనేశాడు కూడా. చివ‌రికి త‌మిళ సినిమా క‌త్తిని రీమేక్ చేయాల‌ని నిర్ణ‌యించుకొన్నారు. దాన్ని చిరు శైలికి మార్చుకొంటున్నారు కూడా. ఇంత‌కీ ఈ క‌థ విలువెంతో తెలుసా? ఇప్పుడు రూ.20 ల‌క్ష‌లు మాత్ర‌మే. క‌త్తి క‌థ‌పై వివాదం న‌డిచిన సంగ‌తి తెలిసిందే. ఈ క‌థ మురుగ‌దాస్ పేరుమీద చ‌లామ‌ణీ అవుతోంది. అయితే క‌త్తి క‌థ నాదే అని తెలుగు ర‌చ‌యిత న‌ర‌సింహారావు కొంత‌కాలంగా పోరాటం సాగిస్తున్నాడు. త‌మిళ ర‌చ‌యిత‌ల సంఘం, ద‌ర్శ‌కుల సంఘం ఈ వివాదం లేల్చ‌లేక చేతులెత్తేసింది. దాంతో న‌ర‌సింహారావు కూడా ఆశ‌లు వ‌దులుకొన్నాడు.

అయితే చిరంజీవి త‌న 150వ చిత్రం కోసం క‌త్తిని రీమేక్ చేస్తున్నాడ‌న‌గానే న‌ర‌సింహారావు మేల్కొన్నాడు. మ‌ళ్లీ పాత ఫైలు తిర‌గేశాడు. దాంతో చిరు సినిమా మొద‌ల‌వ్వ‌డానికీ ఆటంకం క‌లిగింది. ఈ వివాదంలో తెలుగు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ఎలాంటి సంబంధం లేక‌పోయినా.. ఆ ప్ర‌భావం మాత్రం పడింది. ఈ విష‌యం తేల్చుకోలేక‌పోతే ఎప్ప‌టికైనా ఇబ్బందే అని భావించిన చిరు.. ఈ స‌మస్య‌ను వెంట‌నే తేల్చ‌మ‌ని త‌మిళ నిర్మాత‌ల్ని కోరాడ‌ట‌. వాళ్లు ఇప్పుడు సెటిల్‌మెంట్ చేసేసుకొన్నార‌ని టాక్‌. రూ.20 ల‌క్ష‌లు ఇచ్చి.. కామ్‌గా సంత‌కాలు పెట్టించుకొన్నార‌ని, ఇక ఈ వివాదం ముగిసిన‌ట్టేన‌ని టాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఇంత కాలంగా ఓ ర‌చ‌యిత సాగించిన ప్ర‌య‌త్నాలు ఇప్ప‌టికి ఫ‌లించాయ‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close