కొత్త కాంబో : మారుతి – సాయిధ‌ర‌మ్‌

వ‌రుస విజ‌యాల‌తో సాయిధ‌ర‌మ్ తేజ్ మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. సాయితో సినిమా చేయాల‌ని నిర్మాత‌లు క్యూ క‌డుతున్నారిప్పుడు. ద‌ర్శ‌కులూ క‌థ‌లు సిద్ధం చేస్తున్నారు. తాజాగా మారుతి కూడా సాయిధ‌ర‌మ్ కోసం ఓ స్టోరీ రెడీ చేశాడ‌ని టాక్‌. దానికి సాయి కూడా ఓకే అనేశాడ‌ట‌. ప్ర‌స్తుతం మారుతి బాబు బంగారంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకొంది. ఈసినిమా పూర్త‌యిన వెంట‌నే సాయిధ‌ర‌మ్‌తో ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. సాయిధ‌ర‌మ్ కాంపౌండ్ వ‌ర్గాలు కూడా ఈ విష‌యాన్ని ధృవీక‌రించాయి. ”సాయికీ, మారుతికీ మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. వీళ్లు త‌ర‌చూ క‌లుస్తుంటారు. మాట‌ల ప్ర‌స్తావ‌న‌లో సాయికి ఓ లైన్ కూడా వినిపించారు మారుతి. త్వ‌ర‌లోనే వీరి కాంబినేష‌న్‌లో ఓ సినిమా ఉంటుంది” అంటున్నారు వాళ్లు.

బాబు బంగారంల‌పై మంచి టాక్ న‌డుస్తోంది. ఈ సినిమా మినిమం యావ‌రేజ్ అయినా.. మారుతి టాప్ లీగ్‌లోకి చేరిపోవ‌డం ఖాయం. ఒక్క‌సారి టాప్ ద‌ర్శ‌కుల జాబితాలో చేరిపోతే.. పెద్ద‌హీరోల‌పైనే దృష్టి ప‌డుతుంది. అలాంట‌ప్పుడు సాయిధ‌ర‌మ్‌తో సినిమా చేసే ఛాన్సుండ‌దు. కానీ మారుతి మాత్రం క‌థ‌కీ, రిలేష‌న్‌కీ ప్రాధాన్యం ఇచ్చే వ్య‌క్తీ అని.. ఈ కాంబినేష‌న్‌లో సినిమా రావ‌డం ఖాయ‌మ‌ని మారుతి స‌న్నిహిత వ‌ర్గాలు సైతం చెబుతున్నాయి. సో.. కాంబో సెట్ట‌యిపోయిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close