మ‌హేష్‌కి ఆమెతో ఒరిగేదేమిటి?

మ‌హేష్ బాబు – మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో సినిమా ఇంకా ప‌ట్టాకెక్క‌క‌ముందే సెన్సేష‌న‌ల్ అయికూర్చుంది. ఈ సినిమా కోసం మ‌హేష్‌, మురుగ‌దాస్ అందుకొంటున్న పారితోషికం చూసి సౌత్ ఇండియ‌న్ సినిమా మొత్తం ముక్కున వేలేసుకొంది. మ‌హేష్‌కి ఈ సినిమాకి గానూ… రూ.24 కోట్లు ద‌క్క‌బోతున్నాయ‌ట‌. ఒక్క మురుగ‌దాసే ఈ సినిమాకి రూ.18 కోట్ల పారితోషికం అందుకొంటున్నాడ‌ని టాక్‌. వీరిద్ద‌ర్నీ ప‌క్క‌న పెడితే క‌థానాయిక‌గా ఎంపికైన ప‌రిణితీ చోప్రాకి రూ.3.5 కోట్లు క‌ట్ట‌బెట్టార‌ట‌. అంటే ఈ ముగ్గురి పారితోషికాల‌కే 45 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ ఖ‌ర్చ‌వుతోంద‌న్న‌మాట‌,.

మ‌హేష్‌, మురుగ‌దాస్ అంటే ఆ మాత్రం పారితోషికం ఇవ్వ‌డంలో త‌ప్పులేదు. బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకొంది కాబ‌ట్టి ప‌రిణితి కూడా అంత అందుకోవ‌డానికి అర్హురాలే.కాక‌పోతే.. మ‌హేష్ సినిమాల్లో హీరోయిన్ పాత్ర వ‌ల్ల కొత్త‌గా ఒరిగే మైలేజీ ఏం ఉండ‌దు. సౌతిండియ‌న్ హీరోయిన్‌ని తీసుకొంటే స‌రిపోతుంది. ఎందుకంటే మురుగ‌దాస్ సినిమాని బాలీవుడ్‌లో విడుద‌ల చేసే ఛాన్స్ లేదు. ఎందుకంటే సౌత్‌లో హిట్ట‌యిన సినిమాని ఆటోమెటిగ్గా ఆయ‌న హిందీలో రీమేక్ చేస్తుంటారు. కాబ‌ట్టి మ‌హేష్ సినిమాని బాలీవుడ్‌లో డ‌బ్ చేసే అవ‌కాశం లేదు. అలాంట‌ప్పుడు బాలీవుడ్ హీరోయిన్‌ని అంత పెట్టి తీసుకోవ‌డంలో అర్థం లేద‌ని సినీ విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. అయితే చిత్ర‌బృందం వాద‌న ఇంకోలా ఉంది. మ‌హేష్ – ప‌రిణితి అంటే ఈ కాంబినేషన్ వ‌ల్ల సినిమాకి కొత్త లుక్ వ‌స్తుందంటున్నారు. అదీ నిజ‌మే క‌దా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ టెన్షన్ : చంద్రబాబు ఎక్కడికెళ్లారు ?

చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు..మాకిప్పుడే తెలియాల్సిందే అని వైసీపీ నేతలు గింజుకుటున్నారు. చంద్రబాబు, లోకేష్ కనిపించకపోయే సరికి వారేమీ చేస్తున్నారో .. ఆ చేసే పనులేవో తమను బుక్ చేసే పనులేమో అని...

వైసీపీ విమర్శలకు చెక్ పెట్టిన పవన్

పిఠాపురంలో జనసేనానిని ఓడించాలని వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసిందో లెక్కే లేదు. వ్యక్తిగత విషయాలను తెరమీదకు తీసుకొచ్చి పవన్ పాపులారిటీని తగ్గించాలని ప్రయత్నించింది.ఇందుకోసం పవన్ నాన్ లోకల్ అని, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో...

గుర్తొస్తున్నారు.. నాయుడు గారు

"ఆయన లేని లోటు పూడ్చలేనిది" సాధారణంగా ప్రఖ్యాత వ్యక్తులు వెళ్ళిపోయినప్పుడు జనరల్ గా చెప్పే వాఖ్యమిది. కానీ నిజంగా ఈ వాఖ్యానికి అందరూ తగిన వారేనా?! ఎవరి సంగతి ఏమోకానీ మూవీ మొఘల్...

చీఫ్ సెక్రటరీ బోగాపురంలో చక్కబెట్టి వెళ్లిన పనులేంటి ?

చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సీక్రెట్ గా చాలా పనులు చక్క బెడుతున్నారు. అందులో బయటకు తెలిసినవి.. తెలుస్తున్నవి కొన్నే. రెండు రోజుల కిందట ఆయన భోగాపురం విమానాశ్రయం నిర్మాణం జరుగుతున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close