తెలంగాణాలో తెలుగుదేశానికి బిజెపి శత్రుపక్షమే?

ఆంధ్రప్రదేశ్ లో మిత్రపక్షంగా వున్న బిజెపితో తెలుగుదేశం సంబంధాలు తెలంగాణాలో శత్రుపూరితంగానే వుండబోతున్నాయి. ”మీరు ఇక్కడ బిజెపి మీద దాడులు చేయవచ్చు అందుకు మీకు పూర్తి స్వేచ్ఛవుంది” అని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం హైదరాబాద్ లో తమ పార్టీ నాయకులకు క్లియరెన్సు ఇచ్చారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో టీ.టీడీపీనేతలతో భేటీ అయిన చంద్రబాబు పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి నర్శింహులు, రావుల చంద్రశేఖరరెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, పెద్దిరెడ్డి తదితరులు హాజరైన ఈ సమావేశంలో తిరుపతి మహానాడులో తెలంగాణపై చేసిన తీర్మానాలపైనా చర్చించారు.వాటిపై పార్టీ అధ్యక్షుడు వివరణలు ఇచ్చారు.

బీజేపీ తమకు సహకరించడం లేదని కొందరు నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళినపుడు ”తెలంగాణలో బీజేపీకీ, మనకూ ఎలాంటి సంబంధం లేదు… అవసరం సందర్భం వచ్చినపుడు రాజకీయంగా బీజేపీపై కూడా దాడి చేయవచ్చునని” వారికి సూచించారు. అందుకు పూర్తి స్వేచ్చనిస్తున్నట్టు ఆయన తెలంగాణా టీడీపీ నేతలతో చెప్పారు.

గతంలో టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారనుకున్నారని, కానీ.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే టీఆర్ఎస్ లో విలీనం చేసే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని, కష్టపడితే పార్టీ అభివృద్ధి చెందుతుందని సూచించారు.

తెలంగాణలో పార్టీని పట్టించుకోవడం లేదని వస్తున్న ప్రచారం వాస్తవం కాదన్నారు. రెండు రాష్ట్రాలూ నాకు ముఖ్యమే. నీటి వివాదం, హైకోర్టు విభజన విషయంలో అనవసరంగా నన్ను నిందిస్తున్నారు. ఆవిమర్శలను మీరు ఎందుకు తిప్పికొట్టడంలేదు? విభజన చట్టంలో ఉన్న విధంగానే మనం నడుచుకుంటున్న విషయాన్ని ప్రజల్లోకి ఎందుకు తీసుకు వెళ్ళడం లేదు అని కూడా తెలంగాణా నాయకుల్ని చంద్రబాబు ప్రశ్నించారని తెలిసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close