హిందూ సెంటిమెంట్ ప్రయోగిస్తున్న వైకాపా

ఏపిలో తెదేపా ప్రభుత్వంపై ప్రతిపక్ష వైకాపా ఎప్పుడు ఏవిధంగా దాడి చేస్తుందో ఊహించడం కూడా కష్టమే. తమ పార్టీ ఎమ్మెల్యేలని ఫిరాయింపులకి ప్రోత్సహిస్తున్న తెదేపాని కట్టడి చేయడానికి వైకాపా అనుసరిస్తున్న వ్యూహాలని గమనిస్తే ఆ సంగతి అర్ధం అవుతుంది. మొదటిసారి తెదేపాని కట్టడి చేయడానికి తెదేపా మంత్రులు, నేతలు రాజధానిలో బినామీ పేర్లతో భూముల కొనుగోలు వ్యవహారాన్ని బయట పెట్టారు. తరువాత డిల్లీ వెళ్లి హడావుడి చేశారు. ఆ తరువాత తెలంగాణా ప్రాజెక్టులని వ్యతిరేకిస్తూ కర్నూలులో నిరాహార దీక్ష చేశారు. వైకాపా ఎమ్మెల్యేల వలసలు ఆగిపోవడం గమనిస్తే ఆయన వ్యూహాలు బాగానే ఫలిస్తున్నట్లు అర్ధమవుతోంది. తెదేపా ప్రభుత్వం నిరంతర ఒత్తిడిలో ఉండేవిధంగా జగన్ వ్యూహాలు రచిస్తున్నట్లు అర్ధమవుతోంది.

వాటి తరువాత తాజాగా సదావర్తి సత్రవ భూముల వ్యవహారం వెలికి తీసి దానిపై గట్టిగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. దానిలో అవినీతిని ప్రశ్నిస్తూనే దానితో ప్రజలలో హిందూ సెంటిమెంటుని కూడా తట్టిలేపే విధంగా మాట్లాడుతుండటం మరో సరికొత్త వ్యూహంగానే భావించవలసి ఉంటుంది. తెదేపా ప్రభుత్వం హిందూ దేవాలయాల భూములని కూడా విడిచిపెట్టడం లేదని వైకాపా నేతలు ధర్మాన ప్రసాదరావు తదితరులు పదేపదే ఆరోపిస్తున్నారు. “హిందూ ఆలయానికని దాతలు ఇచ్చిన సదావర్తి సత్రవ భూములని స్వంతం చేసుకొని తెదేపా హిందువులకి అన్యాయం చేయాలనుకొంటోందా?” అని ధర్మాన ప్రశ్నించడం అదే సూచిస్తోంది. ఈ వ్యవహారంలో జరిగిన అవినీతిని ప్రశ్నిస్తే వైకాపాని ఎవరూ ఎవరూ తప్పుపట్టరు కానీ ఆ సాకుతో హిందువులలో సెంటిమెంటుని రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేయడమే చాలా తప్పు.

హిందువులనే కాక ముస్లింలు, క్రీష్టియన్లను కూడా రెచ్చగొట్టే విధంగా వైకాపా నేతలు మాట్లాడటం చాలా దారుణమనే చెప్పక తప్పదు. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పేరిట దేవాలయాలని, మసీదులని, చర్చిలని తెదేపా ప్రభుత్వం కూల్చివేస్తోందని వైకాపా అధికార ప్రతినిధి పార్ధ సారధి ఆరోపించారు. హిందూ, ముస్లిం, క్రీస్టియన్ మత పెద్దలు, రాష్ట్ర భాజపా నేతలు దీనిపై తక్షణం స్పందించాలని విజ్ఞప్తి చేశారు. వివిధ మతాల భక్తుల మనోభావాలు దెబ్బ తీస్తున్న తెదేపా ప్రభుత్వాన్ని ప్రతిఘటించేందుకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఏ మతానికి చెందిన ప్రజలు ఆందోళన చేయకపోయినా అందరూ కలిసి పోరాడాలని పిలుపునివ్వడం అంటే వారిని రెచ్చగొడుతున్నట్లే భావించవలసి ఉంటుంది.
దేశంలో రాజకీయ పార్టీలు తమ రాజకీయ లబ్ది కోసమో లేకపోతే తమ రాజకీయ ప్రత్యర్దులని దెబ్బ తీయడం కోసమో ఈవిధంగా వ్యవహరిస్తుండటం వలననే దేశంలో మతఘర్షణలు, అశాంతి ఏర్పడుతుంటుంది. వైకాపా స్వయంగా ఒక మతానికి, కులానికి ప్రాధాన్యతనిస్తున్నప్పటికీ అది లౌకికవాద పార్టీయేనని నమ్మి నేటికీ రాష్ట్ర ప్రజలు దానిని ఆదరిస్తున్నారు. కానీ ఈవిధంగా వ్యవహరిస్తే ప్రజలు కూడా పునరాలోచించుకోవచ్చు. తెదేపాని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని దెబ్బ తీయాలనుకొంటే రాజకీయంగా ఎదుర్కోవచ్చు. దానికి ఎవరూ అభ్యంతరం చెప్పరు కానీ అందుకోసం ఈవిధంగా ప్రజలని రెచ్చగొట్టడం సరికాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close