శ్రీ‌కాంత్ భారీ ప్లానే వేస్తున్నాడు

శ్రీ‌కాంత్ ఇంటి నుంచి వ‌స్తున్న హీరో.. రోష‌న్‌. నిర్మ‌లా కాన్వెంట్‌లో క‌థానాయ‌కుడిగా న‌టించాడు. ఈ సినిమాతో రోష‌న్ భ‌విష్య‌త్తు ముడిప‌డి ఉంది. శ్రీ‌కాంత్ కూడా త‌న‌యుడిపై చాలా ఆశ‌లే పెట్టుకొన్నాడు. మొద‌టి సినిమా అన్న‌పూర్ణ బ్యాన‌ర్‌లో ప‌డడం, నాగార్జున ఆ సినిమాలో కీల‌క పాత్ర పోషించ‌డంతో… శ్రీ‌కాంత్ చాలా హ్యాపీగా ఉన్నాడు. సినిమా కూడా బాగా వ‌చ్చింద‌ని తెలియ‌డంతో… ఈసినిమాకి కావ‌ల్సినంత ప్ర‌మోష‌న్ దండుకొని, త‌న‌యుడ్ని ప్ర‌మోట్ చేసుకోవాల‌ని ప్లాన్ వేస్తున్నాడు శ్రీ‌కాంత్‌.

శ్రీ‌కాంత్‌ది వంద సినిమాల అనుభ‌వం. ఇండ్ర‌స్ట్రీలో అంద‌రికీ కావాల్సిన వాడే. చిరంజీవి నుంచి, రామ్‌చ‌ర‌ణ్ వ‌ర‌కూ దాదాపు అంద‌రు అగ్ర హీరోల‌తోనూ క‌ల‌సి ప‌నిచేశాడు. మ‌రీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి బాగా కావ‌ల్సిన‌వాడు. అందుకే.. వాళ్లంద‌రినీ ఈసినిమా ప్ర‌మోష‌న్ల‌కు విరివిగా వాడుకోవాల‌ని భావిస్తున్నాడ‌ట‌. ఆడియో ఫంక్ష‌న్లు, టీజ‌ర్ లాంచ్‌లూ, స‌క్సెస్ మీట్లూ ఇలా ప్ర‌తీ వేడుకా.. ఓ హీరోతో చేయించాల‌ని చూస్తున్నాడు. ఈ సినిమాలో నాగార్జున హ్యాండు కూడా ఉండ‌డంతో.. ప్ర‌మోష‌న్ల‌కు ఎలాంటి ఆటంకం క‌లిగే అవ‌కాశం లేదు.. సో.. నిర్మ‌లా కాన్వెంట్ ప్ర‌మోష‌న్ల‌లో హీరోలంద‌రినీ చూడొచ్చ‌న్న‌మాట‌. మొత్తానికి రోష‌న్‌ టేకాఫ్ ప‌రంగా ఓ తండ్రి గాఏం చేయాలో అవ‌న్నీ చేస్తున్నాడు శ్రీ‌కాంత్‌. మ‌రి ఫ‌లితం ఎలా ఉంటుందో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైకోర్టును ఆశ్రయించిన ఎన్టీఆర్…ఎందుకంటే..?

జూనియర్ ఎన్టీఆర్ తన ల్యాండ్ కు సంబంధించి వివాదం తలెత్తడంతో హైకోర్టును ఆశ్రయించారు. జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 75లో ఉన్న ప్లాట్ విషయంలో ఈ వివాదం తలెత్తింది. 2003లో గీత లక్ష్మీ అనే...

సరైన ఏర్పాట్లు ఉంటే ఏపీలో 90 శాతం పోలింగ్ !

దేశంలో అత్యధిక రాజకీయ చైతన్యం ఉన్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది. 82 శాతం వరకూ పోలింగ్ నమోదయింది. అంతా పెద్ద పెద్ద క్యూలైన్లు ఉండటాన్ని గొప్పగా చెబుతున్నారు. కానీ పోలింగ్ పర్సంటేజీ...

ఇసుక మాఫియాకు సుప్రీంకోర్టు లెక్కే కాదు !

ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తోంది. ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశిస్తోంది. కానీ ఎప్పటికప్పుడు మాఫియా మాత్రం అబ్బే ఇసుక...

ఖరీదైన స్థలం కొని ఘోరంగా మోసపోయిన జూ.ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ తాను కొన్న స్థలం విషయంలో వివాదం తలెత్తడంతో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీలోని 681 చదరపు గజాల స్థలాన్ని సుంకు గీత అనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close