తెలంగాణాలో స్థానికులకి అవకాశాలు ఉండవా?

ఆంధ్రా పాలకుల చేతిలో తెలంగాణా ప్రాంతం, ప్రజలు, సహజవనరులు అన్నీ దోపిడీకి గురవుతున్నాయి కనుక తెలంగాణా రాష్ట్రం ఏర్పడితేనే న్యాయం జరుగుతుందని పోరాడి తెలంగాణా సాధించుకొన్నారు. తెలంగాణా కోసం పోరాడిన తెరాసయే ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పటికీ రాష్ట్రంలో గల పరిశ్రమలలో, ఐటి కంపెనీలలో, వివిధ ఇతర సంస్థలలో తెలంగాణా ప్రజలకి ఉద్యోగాలు లభించడం లేదు. ప్రైవేట్ సంస్థలు నేటికీ స్థానికేతరులకే ప్రాధాన్యత ఇస్తున్నాయని ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. అన్ని సంస్థలలో 80శాతం ఉద్యోగాలు తెలంగాణా స్థానికులకే ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించాలని అయన కోరారు.

తెరాస అధికారంలోకి వచ్చిన కొత్తలో అన్నీ తెలంగాణా ప్రజలకే దక్కాలి అన్నట్లుగా మాట్లాడేది..వ్యవహరించేది. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా నిర్వహించినపుడు స్థానికత అంశంపై చాల చర్చ జరిగింది. కానీ తెరాస ప్రభుత్వం అధికారంలో కుదురుకొన్న తరువాత దాని ఆలోచనలలో, ప్రాధాన్యతలలో చాలా మార్పు వచ్చింది. తెరాస ప్రభుత్వం ఎల్లప్పుడూ ఎన్నికలు, ఓట్లు, అధికారం సుస్థిరం చేసుకోవడం, అందుకోసం ప్రతిపక్ష పార్టీలలో ఫిరాయింపులని ప్రోత్సహించడం గురించే ఎక్కువగా ఆలోచిస్తోందనే విమర్శలు ఎదుర్కొంటోంది.

తెరాసయే రాష్ట్రంలో శాస్వితంగా అధికారంలో ఉండాలనే ఆలోచనతో సిద్దాంతాలని, తన ఆశయాలని, చివరికి తెలంగాణా కోసం పోరాడినవారిని కూడా పక్కనబెట్టి, ఎన్నడూ తెలంగాణా కోసం మాట్లాడని ప్రతిపక్ష పార్టీల నేతలని పార్టీలో చేర్చుకొని వారికే పదవులు కట్టబెట్టడంతో ఇప్పుడు తెరాస స్వరూపమే పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఎవరు రాష్ట్రానికి అన్యాయం చేశారని తెరాస వాదించేదో, ఇప్పుడు మళ్ళీ వారి చేతికే రాష్ట్ర పగ్గాలు అప్పగించిందని విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే తెరాస ప్రభుత్వంలో కూడా ‘స్థానికులకి’ అవకాశం లేకుండా పోయిందని స్పష్టం అవుతోంది.

ఇక తెలంగాణా అభివృద్ధి పేరిట రాష్ట్రంలో జరుగుతున్న నిర్మాణ పనులలో కూడా ఆంధ్రాకి చెందిన కాంట్రాక్టర్లకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. సహజంగానే వారి సంస్థలలో ఆంధ్రావారికే ఉద్యోగాలలో ప్రాధాన్యత ఉంటే ఆశ్చర్యమేమీ లేదు. తెలుగు సినిమా రంగం మొదటి నుంచి ఆంధ్రాప్రాంతం వారి చేతిలోనే ఉంది కనుక దానిలోనూ ఆంధ్రావారికే ప్రాధాన్యత దక్కడం సహజమే. తెలంగాణాకి చెందిన జూనియర్ ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు, ఇంకా వివిధ శాఖలకి చెందినవారు తమకి అన్యాయం జరుగుతోందని ఈ రెండేళ్లలో చాలాసార్లు రోడ్డెక్కిన సంగతి అందరికీ తెలిసిందే. ఉన్నత విద్యా, వైద్య, పారిశ్రామిక, వ్యాపార తదితర రంగాలు కూడా నేటికీ చాలా వరకు ఆంధ్రావారివే ఉన్నాయి. కనుక అక్కడా స్థానికులకి ప్రాధాన్యత తక్కువే ఉంటుందని చెప్పకతప్పదు. చివరికి తెలంగాణా న్యాయవ్యవస్థలో కూడా ఆంధ్రావారికే ప్రాధాన్యత ఇవ్వడంతో తెలంగాణా న్యాయవాదులు న్యాయం కోరుతూ రోడ్డెక్కడం అందరూ చూస్తూనే ఉన్నారు.

అంటే అటు ప్రభుత్వంలోను, ప్రైవేట్ సంస్థలలో కూడా స్థానికులకి అవకాశాలు దక్కడం లేదని స్పష్టం అవుతోంది. అంటే తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటికీ పరిస్థితులలో పెద్దగా మార్పు ఏమీ రాలేదని స్పష్టం అవుతోంది. దానినే ప్రొఫెసర్ కోదండరాం ప్రశ్నిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close