కాంగ్రెస్ ని దెబ్బ తీయడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న భాజపా

ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా జరుగవచ్చు. వాటి కోసం కాంగ్రెస్, భాజపాలు అప్పుడే తగిన వ్యూహాలు సిద్దం చేసుకొంటున్నాయి. ఆ రెండు పార్టీలకి కూడా ఉత్తరప్రదేశ్ ఎన్నికలు చాలా కీలకమైనవి కావడంతో ఆ రాష్ట్రంపైనే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాయి. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా డిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ని నిలబెట్టే అవకాశం ఉందని తెలిసిన వెంటనే ఆమెపై నీళ్ళ ట్యాంకర్ల కుంభకోణం కేసులో ఎసిబి ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసింది. ఈ రోజు ఆమెకు సమన్లు కూడా జారీ చేసింది. దానితో ఆమెని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ వెనకాడుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ నేతలలో కూడా కొందరు అదే కారణంతో ఆమె అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. అంటే భాజపా (మోడీ ప్రభుత్వం) వ్యూహం బాగానే పనిచేసిందని భావించవలసి ఉంటుంది.

యూపి ఎన్నికల ప్రచార బాధ్యతలని ఈసారి ప్రియంకా వాద్రాకి అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు మీడియాలో చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్ అధిష్టానం ఏనాడూ వాటిని ఖండించలేదు. అంటే ఆ వార్తలు నిజమేనని భావించవచ్చు. ఈ విషయంలో కూడా భాజపా చాలా తెలివిగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టింది. భాజపా నేత దినేష్ శర్మ మీడియాతో మాట్లాడుతూ, “యూపి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎవరు సారధ్యం వహిస్తారనే దానితో మాకు తేడా ఉండదు. ఎందుకంటే ఆ పార్టీకి ఎవరు సారధ్యం వహించినా ఎన్నికలలో గెలవలేదు. ఇప్పటికే యూపిలో ఆ పార్టీ దాదాపుగా తుడిచిపెట్టుకు పోయింది. వచ్చే ఎన్నికలలో పూర్తిగా తుడిచిపెట్టుకు పోవడం ఖాయం,” అని అన్నారు.
ప్రియాంకా వాద్రా నాయకత్వం వహించడం గురించి వచ్చిన వార్తలపై స్పందిస్తూ, “మొదట సోనియాజీ నాయకత్వమన్నారు. ఆ తరువాత రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తారన్నారు. ఇప్పుడు ప్రియాంకా వాద్రా నాయకత్వం వహిస్తారని చెపుతున్నారు. అంటే సోనియా నాయకత్వంపై నమ్మకం లేకనే రాహుల్ గాంధీని, మళ్ళీ ఆయనపై నమ్మకం లేకనే ఇప్పుడు ప్రియాంకా వాద్రాని తీసుకువస్తున్నట్లున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్ధిగా షీలా దీక్షిత్ ని బరిలో దింపుతామని చెపుతుంటారు. కాంగ్రెస్ పార్టీకి ఎవరు నాయకత్వం వహించినా దానిని ఎవరూ కాపాడలేరు. ఒకప్పుడు జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోయింది. మున్ముందు ఇంకా దిగజారినా ఆశ్చర్యం లేదు,” అని అన్నారు.
యూపిలో చాలా మంది భాజపా నేతలు ఇదే విధంగా కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. బహుశః అందుకేనేమో కాంగ్రెస్ పార్టీ నష్టనివారణ చర్యలు చేపట్టింది. మాజీ కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ మీడియాతో మాట్లాడుతూ, “అసలు ఈ ప్రింట్, ఎలెక్ట్రానిక్ మీడియాకి ఇటువంటి వార్తలు ఎవరు అందిస్తారో..అవి ఎలాగ ఎక్కడ నుంచి పుట్టుకు వస్తాయో అర్ధం కావడం లేదు. ప్రియాంక వాద్రాకి పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించాలని మేము ఆలోచనే చేయలేదు. ఇదివరకు చాలాసార్లు ఆమె ఎన్నికలలో ప్రచారం చేశారు. యూపి ఎన్నికలలో కూడా ఆమె పార్టీ కోసం ప్రచారం చేస్తే చేయవచ్చు. అలాగే షీలా దీక్షిత్ అభ్యర్ధిత్వంపై కూడా మేము ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు,” అని అన్నారు.
అంటే ప్రియాంకా వాద్రా విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గినట్లే కనిపిస్తోంది. మీడియాలో ఏవేవో వార్తలు రావడం, వాటిపై భాజపా నేతలు ఏవో విమర్శలు చేస్తుడటం గమనిస్తే, భాజపా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీని అడ్డుకొంటోందని అర్ధమవుతోంది. కాంగ్రెస్ పార్టీయే తమ అభ్యర్ధి గురించి, ప్రియాంకా వాద్రాకి ప్రచార బాధ్యతలు అప్పగించడం గురించి మీడియాకి లీకులు ఇచ్చింది. దానిని భాజపా చక్కగా ఉపయోగించుకొని అడ్డుపడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వెట‌ర‌న్‌ల‌కు వెండి తెర స్వాగ‌తం

క్రికెట్‌లో వెట‌రన్ అనే మాట ఎక్కువ‌గా వాడుతుంటారు. ఆటగాడిగా రిటైర్ అయిపోయిన త‌ర‌వాత‌.. వాళ్లంతా వ్య‌క్తిగ‌త జీవితాల‌కు ప‌రిమితం అయ్యేవారు. ఇప్పుడు ఐపీఎల్ వ‌చ్చింది. దాంతో రిటైర్ ఆట‌గాళ్లంతా కోచ్‌లుగా, మెంట‌ర్లుగా మారుతున్నారు....

అందర్నీ గొడ్డలితో నరికేసి సింగిల్ ప్లేయర్ అవ్వండి – భారతికి షర్మిల సలహా

వైఎస్ జగన్, ఆయన సతీమణిపై వైఎస్ షర్మిలారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బధవారం మీడియాతో మాట్లాడిన షర్మిల వైసీపీ వాళ్లే అధికారంలో ఉండాలి... వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వారందర్నీ...

విజ‌య్ సినిమాల‌కు టైటిళ్లు కావ‌లెను!

రేపు.. అంటే మే 9న విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా విజయ్ కొత్త సినిమాల సంగ‌తులు రేపే రివీల్ కాబోతున్నాయి. మైత్రీ మూవీస్ లో విజ‌య్ ఓ సినిమా చేస్తున్నాడు....

మొదటిసారి కాంగ్రెస్ ట్రాప్ లో మోడీ..!?

ఇన్నాళ్ళు పదునైన విమర్శలతో కాంగ్రెస్ ను ఇరకాటంలోకి నెట్టేసిన ప్రధాని మోడీ మొదటిసారి కాంగ్రెస్ ట్రాప్ లో పడినట్లుగా కనిపిస్తోంది. ప్రతి ఎన్నికల ప్రచార సభలో రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తుండటంతో మోడీ కాంగ్రెస్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close