సోము వీర్రాజుని ఏపి భాజపా అధ్యక్షుడుగా నియమించే అవకాశం?

భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర భాజపా కోర్ కమిటీ నేతలతో శుక్రవారం డిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర భాజపా అధ్యక్షుడు నియామకం గురించి ఎటువంటి చర్చ జరుగలేదని ప్రస్తుత అధ్యక్షుడు కంబంపాటి హరిబాబు చెప్పినప్పటికీ, దానిపై కూడా చర్చ జరిగినట్లు ఆయన మాటలే తెలియజెప్పుతున్నాయి. అధ్యక్షుడి నియామకం గురించి అమిత్ షా ప్రకటన చేస్తారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాజపా అధ్యక్షుడుగా సోము వీర్రాజుని నియమించాలని భాజపా అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. బహుశః నేడో రేపో అధ్యక్షుడి పేరు ప్రకటించవచ్చని తెలుస్తోంది.

అయన తెదేపాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా వ్యతిరేకిస్తారు కనుక ఒకవేళ సోము వీర్రాజుని అధ్యక్షుడుగా నియమించినట్లయితే, తెదేపా-భాజపాల సంబంధాలపై అది తీవ్ర ప్రభావం చూపవచ్చు. కానీ ఆయన అధ్యక్షుడయితే రాష్ట్రంలో భాజపా కార్యక్రమాలలో వేగం పుంజుకొనే అవకాశం ఉంటుంది.

ఈరోజు జరిగిన సమావేశానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి డా. కామినేని శ్రీనివాసరావు హాజరు కాకపోవడం విశేషం. ఆయన ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా సమర్ధిస్తూ మాట్లాడుతుంటారు. కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్, రాష్ట్ర మంత్రి మాణిక్యాల రావు, ప్రస్తుత అధ్యక్షుడు కంబంపాటి హరిబాబు, పురందేశ్వరి, సోము వీర్రాజు, పార్టీ జాతీయ కార్యదర్శులు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ల‌వ్ మీ’ ట్రైల‌ర్‌: భ‌యంతో కూడిన ఓ ప్రేమ‌క‌థ‌!

https://youtu.be/BacOcD8e_3k?si=D6mw3GiNjusn8mnE దెయ్యంతో ప్రేమ‌లో ప‌డ‌డం ఓ ర‌కంగా కొత్త పాయింటే. 'ల‌వ్ మీ' క‌థంతా ఈ పాయింట్ చుట్టూనే తిర‌గ‌బోతోంది. ఆశిష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన సినిమా ఇది. దిల్ రాజు బ్యాన‌ర్‌లో తెర‌కెక్కించారు. ఈనెల...

2గంటల్లో భారీ వర్షం.. హైదరాబాద్ బీ అలర్ట్..!!

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ , సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల,రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం ఎండలు భగ్గుమనగా మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా...

ట్యాక్సుల‌పై నిర్మ‌ల‌మ్మ‌కు డైరెక్ట్ పంచ్… వీడియో వైర‌ల్

ఒకే దేశం- ఒకే పన్ను అని కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన జీఎస్టీ సామాన్యుల పాలిట గుదిబండగా మారిందన్న విమర్శలు వస్తుండగా.. తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి...

ఐప్యాక్ ఆఫీస్‌కు వెళ్లింది ప్రశాంత్ కిషోర్‌కు కౌంటర్ ఇవ్వడానికా ?

ఐప్యాక్ తో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న వైసీపీ అధినేత జగన్ చివరి సందేశం ఇవ్వడానికి వారి ఆఫీసుకు వెళ్లారు. గతం కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. అంత వరకూ బాగానే ఉంది...

HOT NEWS

css.php
[X] Close
[X] Close