సదావర్తి సత్రం భూముల కధ కంచికి

సదావర్తి సత్రం భూముల కుంభకోణం గురించి కొన్ని రోజులు హడావుడి చేసిన వైకాపా ప్రస్తుతం గడప గడపకీ తిరుగుతున్నందున క్షణం తీరిక లేకుండా ఉంది. కనుక దాని గురించి మాట్లాడటం లేదిప్పుడు. సదావర్తి భూముల వేలాన్ని రద్దు చేయాలని కోరుతూ బ్రాహ్మణ సమాక్య తరపున ద్రోణంరాజు రవికుమార్ వేసిన పిటిషన్ పై విచారించిన హైకోర్టు అది విచారణకి అర్హమైనది కాదని చెపుతూ మంగళవారం ఆ కేసుని కొట్టివేశారు. చెన్నై సమీపంలో మహాబలిపురం వద్ద ఉన్న 86 ఎకరాల సదావర్తి సత్రవ భూములు ఆక్రమనలకి గురవుతున్నాయనే సాకుతో వేలం వేయించి కోట్లు పలికే వీలైన భూమిని ఎకరం రూ.22 లక్షలకే తెదేపా నేతలు స్వంతం చేసుకొన్నారని, కనుక దానిని రద్దు చేసి మళ్ళీ బహిరంగ వేలం నిర్వహించాలని కోరారు. దానిపై నిన్న ఈరోజు విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషనర్ వాదనకి బలమైన ఆధారాలు చూపకపోవడంతో, అది విచారణార్హం కాని కేసు అని పేర్కొంటూ కొట్టి వేశారు. పత్రికలలో వచ్చిన వార్తలు ఆధారంగా కేసు పెట్టినందుకు పిటిషనర్ ని హైకోర్టు మందలించింది.

సదావర్తి కుంభకోణంపై లోతుగా అధ్యయనం చేసేందుకు ధర్మాన ప్రసాద రావు నేతృత్వంలో కొందరు వైకాపా నేతలు చెన్నై కూడా వెళ్లి వచ్చారు. ఆలయ భూములని కూడా చూడకుండా తెదేపా నేతలు కారుచౌకగా కొట్టేశారని విమర్శించారు. సాక్షి మీడియాలో కూడా సదావర్తి భూముల విషయంలో జరిగిన అవినీతి గురించి పుంఖానుపుంఖాలుగా వార్తలు ప్రచురించింది.
వైకాపా తను స్వయంగా న్యాయ పోరాటం చేయకపోయినా పిటిషనర్ కి తను సేకరించిన వివరాలన్నీ అందించి సహకరించి ఉండి ఉంటే, హైకోర్టు ఆ కేసుని అంత తేలికగా కొట్టేసి ఉండేదే కాదు. అవసరమైతే విచారణకి కూడా ఆదేశించి ఉండేది. కానీ వైకాపా ఎందుకో పట్టించుకోకపోవడంతో సదావర్తి కధ కంచికి చేరింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫోటోలు – టీడీపీ మేనిఫెస్టోలో వైసీపీకి కనిపిస్తున్న లోపాలు !

వైసీపీ మేనిఫెస్టోపై ప్రజల్లో జరుగుతున్న చర్చ జీరో. ఆ పార్టీ నేతలు కూడా మాట్లాడుకోవడం లేదు. కానీ టీడీపీ మేనిపెస్టోపై టీడీపీ నేతలు ప్రత్యేకమైన ప్రణాళికలతో ప్రచార కార్యక్రమం పెట్టుకున్నారు. అదే...

టార్గెట్ పవన్ కళ్యాణ్ …పొన్నూరులో వైసీపీ అభ్యర్థి దౌర్జన్యం

ఏపీలో టీడీపీ సారధ్యంలోని కూటమిదే అధికారమని సర్వేలన్నీ స్పష్టం చేస్తుండటంతో వైసీపీ నేతల్లో ఫ్రస్టేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబును అడ్డుకుంటే అది వైసీపీకి డ్యామేజ్ చేస్తుందని భావించి పవన్ ను వరుసగా టార్గెట్...

బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ … లక్ష్యం అదే..!?

బీఆర్ఎస్ దారిలోనే కాంగ్రెస్ కూడా వెళ్తున్నట్లు కనిపిస్తోంది.గతంలో ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గానికి బీఆర్ఎస్ ప్రాధాన్యత ఇచ్చినట్టుగానే ప్రస్తుతం కాంగ్రెస్ కూడా అదే చేస్తుండటంతో ఆ పార్టీపై పెదవి విరుపులు మొదలయ్యాయి. ...

మోదీ రోడ్ షోలతో కూటమికి మరింత ఊపు !

ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేయడానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రానున్నారు. ఆయన టూర్ షెడ్యూల్‌ కూడా ఖరారైంది. చిలకలూరిపేటలో ఉమ్మడి ప్రచార సభ నిర్వహించిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close