పవన్ కల్యాణ్ను స్క్రీన్ పై చూడాలని చాలా మంది ఫ్యాన్స్ అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు పవన్ స్క్రీన్ పైకి వచ్చే టైమ్ అయింది. అయితే అది సినిమా కాదు. పవన్ కల్యాణ్ సినిమా రావడానికి ఇంకా టైమ్ ఉంది. ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగానే .. పవన్ స్క్రీన్ పైకి వస్తున్నారు. ఒక గ్రామంలోని ప్రజలతో ముచ్చటించి, వాళ్ల సమస్యలను వినేందుకు ‘‘మన ఊరి కోసం మాటామంతీ’’ అనే స్ర్కీన్ గ్రీవెన్స్ అనే ప్రోగ్రాంను పవన్ ప్లాన్ చేశారు.
ప్రజలతో మమేకమై, వారి నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. సినిమా ధియేటర్ లో స్ర్కీన్ ద్వారా.. ప్రజలతో ముఖాముఖి జరపపోతున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలోని రావివలస గ్రామ ప్రజలతో పవన్ మాట్లాడనున్నారు. ఇక్కడి ప్రజల్లో 290 మందిని స్థానిక భవాని ధియేటర్ కు తీసుకెళ్తున్నారు. పవన్… ప్రజల సమస్యలను వింటారు.
అభిమానుల తాకిడి, భద్రత కారణాల దృష్ట్యా గ్రామీణ ప్రజలతో ప్రత్యక్ష పర్యటనల్లో పెద్దగా మాట్లాడలేకపోతున్నారు. అందుకే ఈ ఏర్పాట్లు చేశారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి పవన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. గ్రామాల్లో తాగు, సాగునీరు, రోడ్లు, మురుగుకాల్వలు, ఉపాధి హామీ పథకం, పాఠశాల విద్య, నిరుద్యోగం, చెరువులు తదితర సమస్యలపై పవన్ చర్చించి పరిష్కారం చూపిస్తారు. ఇది ఇతర చోట్ల కూడా సాగనుంది. సినిమా స్క్రీన్ పై పవన్ తో మాట్లాడటం వల్ల .. నేరుగా చూశామన్న భావన కలుగుతుదంన్న కారణంగా ఈ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది.