దేశంలోనే అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ డీల్ ముంబైలో జరిగింది. ఒబెరాయ్ 360 వెస్ట్ పేరుతో ఉన్న సూపర్-లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ లో రెండు డూప్లెక్స్ అపార్టుమెంట్లను రూ. 639 కోట్లకు లీనా గాంధీ అనే పారిశ్రామికవేత్త కొనుగోలు చేశారు. లీనా గాంధీ తివారీ యూఎస్వీ ఫార్మాస్యూటికల్స్ యజమాని. వర్లీలో అత్యంత లగ్జరీ సముద్ర ఒడ్డున ఒబెరాయ్ 360 వెస్ట్ అపార్టుమెంట్ కాంప్లెక్స్ ఉంది.
ఒబెరాయ్ రియల్టీ అభివృద్ధి చేసిన ఒబెరాయ్ 360 వెస్ట్ ప్రాజెక్ట్ సూపర్-లగ్జరీ రెసిడెన్షియల్ కేటగిరీ కిందకు వస్తుంది. ఎస్ఎఫ్టీకి దాదాపు 2 లక్షల 83 వేలు వెచ్చించారు. రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఈ ధర అత్యధిక రేట్లలో ఒకటి. రెండు డూప్లెక్స్ల సంయుక్త కార్పెట్ ఏరియా సుమారు 22,562 చదరపు అడుగులు. ఇంత ధర పెట్టారంటే ఆ అపార్టుమెంట్లు ఎంత లగ్జరీగా ఉంటాయో చెప్పాల్సిన పని లేదు. సామాన్యులు అంచనా వేయలేరు.
లీనా గాంధీ కొనుగోలు భారతదేశ రియల్ ఎస్టేట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. హై-నెట్-వర్త్ వ్యక్తులలో అల్ట్రా-లగ్జరీ ఆస్తులకు పెరుగుతున్న డిమాండ్ను ఈ డీల్ సూచిస్తుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. దేశ రియల్ ఎస్టేట్ మార్గెట్ లో గుర్గావ్, ముంబైలలో అపార్టుమెంట్లు, లగ్జరీ ఫ్లాట్లు, పెంట్ హౌస్లకు వందల కోట్ల విలువ ఉంటోంది.