కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయన్న కవిత వ్యాఖ్యలను బేస్ చేసుకుని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. యాదాద్రి భువనగరి జిల్లాలో ప్రజాపాలన – ప్రగతి బాట బహిరంగసభలో ప్రసంగించారు. తాను చేసిన పనులను ఏకరవు పెడుతూనే..బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. ఆ ఇంటి బిడ్డనే చుట్టూ దయ్యాలు ఉన్నాయని బయటపెట్టినా… ఆ దయ్యాల నాయకుడు సమాధానం చెప్పడం లేదని కేసీఆర్ పై విమర్సలు గుప్పించారు. అది బీఆర్ఎస్ కాదు డీఆరెస్.. భారత రాష్ట్ర సమితి కాదు… దెయ్యాల రాష్ట్ర సమితి ..ఈ కొరివి దెయ్యాలను తెలంగాణ పొలిమేరల వరకు తరిమికొట్టాలన్నారు.
పదేళ్లు దోచుకుతిన్న రాబందులు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారని…ఒక్క నోటీసు ఇస్తేనే ఆయన ఆగమాగం అవుతున్నారని మండిపడ్డారు. జవాబు చెప్పాల్సింది పోయి విమర్శలు చేస్తున్నారని అన్నారు. ముందు కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. ఈ సభలో తాను చేసిన పనులను అన్నీ రేవంత్ చెప్పుకున్నారు కానీ బీఆర్ఎస్ పై సమయానుకూలంగా విరుచుకుపడటమే రేవంత్ స్పీచ్ హైలెట్ అనుకోవచ్చు.
కవిత చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఏమీ మాట్లాడలేకపోతున్నారు. ఈ అంశాన్ని రేవంత్ హైలెట్ చేశారు. కేసీఆర్ అసలు బయటకు రావడం లేదు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలోనూ పాల్గొనలేదు. కవిత ఇష్యూతో బీఆర్ఎస్ పై మరింతగా ఎటాక్ చేసేందుకు రేవంత్ రెడ్డి ఎప్పుడూ సన్నద్ధంగా ఉంటారని మరోసారి స్పష్టమయింది.