‘పవన్ కళ్యాణ్ ఓ తుపాన్ అని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ గారు కితాబు ఇచ్చారు. ఆయన్ని ఎవడు ఆపుతాడు? అన్నారు నిర్మాత సునీల్ నారంగ్. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్గా సునీల్ నారంగ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో థియేటర్స్ బంద్ ఇష్యూ ప్రస్తావనలోకి వచ్చింది. ‘థియేటర్స్ బంద్ అని ఎవరూ చెప్పలేదు. చాలా అన్యాయంగా ఆ ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్ సినిమాని ఎవడు ఆపుతాడు? ఆయన సినిమాని ఆపితే నెక్స్ట్ వారంలో వచ్చే నా సినిమా పరిస్థితి ఏమిటి? అసలు బంద్ అనేది ఎప్పుడూ జరగదని చెప్పుకొచ్చారు సునీల్ నారంగ్.
కొత్తగా ఎన్నికైన సెక్రటరీ శ్రీధర్ మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. 2016 నుంచి మేము పర్సంటేజ్ గురించి పోరాడుతున్నాము. మేము ఎప్పుడూ బంద్ అని చెప్పలేదు. పవన్ కళ్యాణ్ సినిమా కోసం థియేటర్స్ అన్నీ ఖాళీగా ఉంచాము. జనవరి నుంచి ఇప్పటివరకు 3 సినిమాలు హిట్ అయితే మా పరిస్థితి ఏమిటి? హీరోలు రెండు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తుంటే థియేటర్స్ ఎలా నడుస్తాయి? హీరోలు ఎక్కువ సినిమాలు చేయాలి. ఏడాది కనీసం రెండు చొప్పున సినిమాలు పెద్ద హీరోల నుంచి రావాలి’ అని కోరారు.