అమరావతి మహిళల్ని వేశ్యని వాదిస్తున్న కృష్ణంరాజు అనే వ్యక్తికి హైదరాబాద్లో వైసీపీ నేతలు షెల్టర్ ఇచ్చినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయన గతంలో పోలీసులు రెయిడ్స్ చేసిన వీడియోలు చూపించి తాను చెప్పినదానికి అవే ఆధారాలు అని అడ్డగోలు వాదనలతో వీడియోలు రిలీజ్ చేస్తున్నాయి. ఏపీ పోలీసులు ఆయనను పట్టుకునేందుకు నిఘా పెట్టారు. ఆయనకు ఎవరు సహకరిస్తున్నారో ఎక్కడ ఉన్నారో కనిపెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఈ కేసు విషయంలో జాతీయ మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది. సుమోటోగా కేసును తీసుకుని ఏపీ డీజీపీకి నోటీసులు జారీ చేసింది. ఏం చర్యలు తీసుకున్నారో మూడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేసించింది. ఎన్సీడబ్ల్యూకు నివేదిక సంపాల్సిన సమయానికి ఆయనను అరెస్టు చేయాల్సిన అవసరం పోలీసులపై పడింది. అయితే పోలీసులు ఆయన ఎవర్ని సంప్రదిస్తున్నారు, ఎవరు కాపాడుతున్నారు అన్న విషయాలను తెలుసుకోవడానికే నిఘా పెట్టి ఉంచారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ప్రస్తుతం అమరావతి మహిళలపై వేశ్యలనే ముద్ర వేసే ప్రయత్నంచేసిన వ్యవహారం జాతీయ స్థాయిలో దుమారం రేగుతోంది. నిందితుల్ని అంత ఆషామాషీగా వదిలే అవకాశాలు కనిపించడం లేదు. జర్నలిజం ప్రమాణాలపైనా చర్చ జరుగుతోంది. రాజకీయ పార్టీలు నిర్వహించే చానళ్లలో వ్యక్తులు ఇలా ఎవరిపైనైనా ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేయవచ్చా అన్నది చర్చనీయాంశం అవుతోంది.