ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున వెన్నుపోటు దినం అని నిరసనలు చేపట్టిన వైసీపీ.. అసలు ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన రోజున మాత్రం సంబరాలు చేసుకోబోతోంది. ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఇచ్చిన తల్లికి వందనం పథకాన్ని గురువారమే అమలు చేయబోతున్నారు. ఏపీలో ఉన్న పిల్లందరికీ..తలా పదిహేను వేల రూపాయలు అకౌంట్లలో జమ చేయబోతున్నారు. మొత్తం ఎనిమిదిన్నర వేల కోట్ల రూపాయలకుపైగా జమ చేయబోతున్నారు.
ఈ పథకాన్ని అమలు చేయలేదని వైసీపీ విమర్శలు చేస్తోంది. పిల్లలను మోసం చేశారని అంటోంది. చాలా కాలంగా ట్రోల్ చేస్తోంది. స్కూల్ ప్రారంభమయ్యే రోజునే ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. స్కూల్స్ కూడా ప్రారంభం కానుండటంతో ప్రభుత్వం నిధుల సమీకరణ చేసి వారి ఖాతాల్లో జమ చేస్తోంది. గత ప్రభుత్వం పదమూడు వేల రూపాయలు ఇచ్చేది. కానీ ప్రచారం మాత్రం పదిహేను వేలు దగ్గర ఉండేది. ఎంత మంది పిల్లలు ఉన్నా కుటుంబంలో ఒక్కరికే ఇచ్చేవారు. ఇప్పుడు ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తున్నారు.
గతంలో యాభైశాతం మంది విద్యార్థులకే పదమూడు వేలు ఇచ్చేవారు. ఇప్పుడు 93 శాతం మందికి దాదాపుగా 68 లక్షల మందికి ఇస్తున్నారు. మిగిలిన ఏడు శాతం పిల్లలు అత్యంత ధనవంతులు.. లగ్డరీ స్కూళ్లలో చదువుతున్న వారు. వారికి వర్తింప చేయడం లేదు. ఈ పథకం అందుకోనున్న పిల్లలలో వైసీపీ కార్యక్తలు, నేతల పిల్లలు కూడా ఉంటారు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా డబ్బులు జమ చేస్తూండటం వారిని కూడా సంతోషపరచనుంది. అందుకే కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన రోజున వైసీపీ కూడా సంబరాలే జరుపుకోనుంది.