కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం ఎలా అమలు చేస్తారని, ఇది అసాధ్యమని ఏడాదిగా ప్రశ్నించారు. కానీ, వైసీపీ అసాధ్యం అని చెప్పిన దాన్ని కూటమి ప్రభుత్వం సుసాధ్యం చేసి చూపించింది. తల్లికి వందనం పథకం ద్వారా 13వేల చొప్పున కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నగదు జమ చేసింది. ఎలాంటి హడావిడి లేకుండా , స్కూల్స్ రీ-ఓపెన్ చేసిన రోజే సైలెంట్ గా నగదు జమ చేయడంతో కుటుంబాల్లో కూటమి పాలనపై హర్షం వ్యక్తం అవుతోంది.
ఓ కుటుంబంలో ఆరుగురు పిల్లలు ఉంటే తల్లికి వందనం పథకంలో భాగంగా ఆ తల్లికి ఏకంగా 78వేల నగదును జమ చేశారు. జగన్ హయాంలో ఓ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక్కరికే అమ్మ ఒడి కింద 13వేలు ఇవ్వడంతో పెద్ద కుటుంబాలలోని పిల్లలను చదివించడం వారికి ఇబ్బందిగా మారింది. కూటమి అధికారంలోకి వచ్చాక పిల్లల సంఖ్య ఆధారంగా లెక్కగట్టి మరీ తల్లికి వందనం ఇచ్చేస్తున్నారు. ఆ సంతోషాలను పెద్ద కుటుంబాలు గ్రామస్తులతో పంచుకుంటున్నారు. చంద్రబాబు, లోకేష్ లకు ధన్యవాదాలు చెబుతున్నారు.
గతంలో కుటుంబంలో ఒకరికి అమ్మకు వందనం పథకం అమలు చేసి, జగన్ మావయ్య అని పిలుపించుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోలను వైరల్ చేసుకున్నారు. ఇప్పుడు కూటమి ఒక్కరికి 13వేల చొప్పున ఇస్తోంది. దీంతో వైసీపీ నేతలను తల్లికి వందనంపై స్పందించాలని కోరినా మొహం చాటేస్తున్నారు. అసాధ్యం ఆనుకున్న పథకం అమలు అవుతుండటం చూసి ఆశ్చర్యపోతున్నారు. తల్లికి వందనం అమలు కావడంతో ఇక జగన్ మావయ్యా పని అయిపోయినట్లేనని అంటున్నారు.