హైదరాబాద్లో ఇప్పుడు అపార్టుమెంట్లలో ఎస్ఎఫ్టీకి రేటు నాలుగు నుంచి ఐదువేల రూపాయల మధ్యలో ఉంది. ఐటీ కారిడార్ దగ్గర కాస్త ఎక్కువ ఉండవచ్చు. కానీ కోకాపేటలో మాత్రం అత్యధిక రేట్లు పలుకుతున్నాయి. అత్యంత లగ్జరీయస్ ప్రాజెక్టుకు కోకాపేట అడ్డాగా నిలుస్తోంది. అలాంటి చోట.. ఎలాంటి పబ్లిసిటీ లేకుండాఓ భారీ ప్రాజెక్టు నిర్మితం అవుతోంది. అదే మైహోమ్ 99 ప్రాజెక్టు.
ఈ ప్రాజెక్టులో 99 యూనిట్లు మాత్రమే ఉంటాయి. అందుకే 99 అని పేరు పెట్టారు. అత్యంత ప్రత్యేకమైన 4 BHK అపార్ట్మెంట్ల ఈ ప్రాజెక్టు స్పెషాలిటీ. ఈ ప్రాజెక్టు నిర్మాణం 2022లోనే ప్రారంభమయింది. 2028 జూలైకి పూర్తిచేస్తారు. 53 అంతస్తులు ఉండే ఈ సింగిల్ టవర్ ప్రాజెక్టులో ఒక్కో ఫ్లాట్ 9,299 నుండి 10,399 చదరపు అడుగులు ఉంటుంది. సామాన్యులు వాడే డబుల్ బెడ్ రూం 1000sft ఉంటే విశాలమైనదని అర్థం. అలాంటిది పది ఫ్లాట్లు కలిపితే ఇక్కడ ఒక్క ఫ్లాట్.
ఆధునిక ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఒక్కో బెడ్ రూం.. పదిహేను వందల SFT ఉంటుంది.
ఈ ప్రాజెక్టును మైహోమ్ గ్రూప్ నిర్మిస్తోందని ప్రాజెక్టుపేరును బట్టే అర్థమైపోతుంది. ప్రతి ప్రాజెక్టు కోసం భారీగా ప్రచారం చేసుకునే మైహోమ్.. ఈ ప్రాజెక్టు విషయంలో మాత్రం చాలా లో ప్రోఫైల్ మెయిన్ టెయిన్ చేస్తోంది. ఎందుకంటే హైక్లాస్ లగ్జరీ కోరుకునేవాళ్లకి ఇప్పటికే ప్రాజెక్టును అమ్మేసినట్లుగా తెలుస్తోంది. SFTకి రూ.16వేలు చొప్పున అమ్మినట్లుగా చెబుతున్నారు. అంటే.. అధికారికంగా ఒక్కో ఫ్లాట్ కనీసం పదహారు కోట్లు అవుతుంది. రిజిస్ట్రేషన్.. ఇతర ఖర్చులు కనీసం మరో నాలుగు కోట్లు అవుతాయి. ప్రస్తుతానికి ఇదే హైదరాబాద్లో అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్ అనుకోవచ్చు.