జగన్ రెడ్డి రాజకీయం ఎలా ఉంటుందో సత్తెనపల్లికి ఆయన పెట్టుకున్న పర్యటన కార్యక్రమమే మరో సాక్ష్యంగా కనిపిస్తోంది. రెంటపాళ్ల అనే గ్రామం వైసీపీకి పట్టు ఉన్న గ్రామం. ఆ గ్రామంలో నాగమలేశ్వర్ రావు అనే వ్యక్తి వైసీపీ నేతగా ఉన్నారు. ఆయన ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది రోజులుకు ఆత్మహత్య చేసుకున్నాడు. గెలుస్తున్నామని జగన్ రెడ్డి మాటలు.. ఆరా మస్తాన్ ఇచ్చిన సర్వే రిపోర్టులతో తనకు ఆస్తి లేకపోయినా.. పది కోట్ల మేర పందెం కట్టారు. ఉన్నదంతా పోగొట్టుకున్నాడు.
బెట్టింగ్ కట్టిన వాళ్లంతా డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తూండటంతో చివరికి ఎవరికీ సమాధానం చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషయం రెంటపాళ్ల కాదు.. సత్తెనపల్లి మొత్తం తెలుసు. జగన్ రెడ్డి చేసిన తప్పుడు ప్రచారానికి.. ఎన్నికల పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఆరా మస్తాన్ అనే ఫేక్ సర్వేయిస్టుతో చేయించిన ప్రచారానికి నాగమలేశ్వరరావు లాంటి వాళ్లు చాలా మంది బలైపోయారు. జగన్ రెడ్డి ఆ కుటుంబాలకు ఒక్క సారి కూడా సంతాపం చెప్పలేదు. ఆదుకునే ప్రయత్నం చేయలేదు.
ఇప్పుడు రాజకీయం చేయడానికి ఆయన బయలుదేరారు. ముందుగానే పార్టీ నేతలకు చెప్పి విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తానంటూ బయలుదేరారు. చిన్న గ్రామం అయన రెంటపాళ్లలో బలప్రదర్శన చేస్తానని ఆయన బయలుదేరారు. ముందుగా ఆ కుటుంబానికి ఎంతో కొంత సాయం అందించి ఉంటే బాగుండేదన్న సెటైర్లు ఉన్నాయి. మరో వైపు జగన్ సత్తెనపల్లి టూర్ పెట్టుకున్నా.. కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు. కన్నా లక్ష్మినారాయణ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంబటిని ఇంచార్జ్ గా తొలగించిన జగన్.. నర్సరావుపేటకు చెందిన నేతకు ఇంచార్జ్ పదవి ఇచ్చారు.