వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పల్నాడువెళ్లేందుకు గుంటూరులో రోడ్ షో చేశారు. పోయేదేదో నేరుగా పల్నాడుకు పోకుండా గుంటూరులో బలప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఏటుకూరు రోడ్డు వద్ద ఆయన కాన్వాయ్ లోని వాహనం ఢీకొని ఓ వృద్ధుడు గాయపడ్డాడు. అతన్నిరోడ్డున పక్కకు లాగేసి.. వైసీపీకార్యకర్తలు వెళ్లిపోయారు. స్థానికుల అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ వృద్ధుడు చికిత్స పొందుతూ చనిపోయాడు.
ఓ ప్రాణం పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడమేకాదు.. కనీసం ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయలేదు. పోలీసులకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఉదయం తొమ్మిది గంటలకు తాడేపల్లిలో బయలుదేరి పదకొండుగంటల కల్లా.. సత్తెనపల్లి చేరుకోవాలి. కానీ ఆయన రెండు గంటల పాటు గుంటూరులోనే .. పిలుచుకువచ్చిన కార్యకర్తలతో ర్యాలీలు చేశారు. ట్రాఫిక్ జాం చేశారు. ఓ వృద్ధుడి మృతికి కారణమయ్యారు.
తన కాన్వాయ్ ఢీ కొని వృద్ధుడు చనిపోయినా.. జగన్ కనీసం పట్టించుకోలేదు. ఆపలేదు. వైద్యం కోసం ఆస్పత్రికి తీసుకెళ్లమని కూడా చెప్పలేదు. ఇంత మానవత్వం లేకుండా రాజకీయాలు చేయడం ఏమిటన్న విమర్శలు వస్తున్నాయి.