నారాలోకేశ్ అమిత్ షాతో అరగంట సేపు సమావేశం అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలతో పాటు రాజకీయ పరమైన నిర్ణయాల గురించి కూడా మాట్లాడినట్లుగా తెలుస్తోంది. రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వచ్చిన లోకేష్.. పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం అవుతున్నారు. అందరితో పాటు అమిత్ షాతో సమావేశమైనట్లుగా.. షెడ్యూల్ ఖరారు చేశారు కానీ.. ప్రత్యేకమైన కారణంతోనే కలిశారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఢిల్లీ వ్యవహారాలు, కూటమి రాజకీయాలను మొత్తం నారా లోకేష్ చూస్తున్నారు. అందుకే ఏపీలో రాజకీయ అంశాలపై నివేదిక ఇచ్చి.. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే విషయంపై చర్చించినట్లుగా చెబుతున్నారు. ఏపీ రాజకీయ పరిణామాలు ఈ చర్చల్లో కీలకంగా ఉన్నాయి. లిక్కర్ స్కాంలో దర్యాప్తుతో పాటు పలు నేరాలకు సంబంధించిన కేసుల ిచారుల పురోగతిని కూడా వివరించినట్లుగా చెబుతున్నారు.
ఏపీలో ప్రతిపక్షం అలజడి రేపేందుకు చేస్తున్న ప్రయత్నాలనూ వివరించినట్లుగా తెలుస్తోంది. ఈ పర్యటనలో నారాలోకేశ్.. ఉపరాష్ట్రపతితో పాటు పలువురు మంత్రుల్ని కలిశారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ తోనూ సమావేశం అవుతారు.