సర్వే నిర్వహిస్తే ప్రతిపక్షాలు భయపడతాయా?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఒకేసారి రెండు సర్వేలు జరుగుతున్నాయి. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రజా సాధికార సర్వే కాగా రెండవది గడప గడపకి వైకాపా పేరిట ఆ పార్టీ చేపట్టిన సర్వే. రెండూ కూడా వేర్వేరు కారణాలా చేత నత్త నడకన సాగుతున్నాయి. ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలో రాష్ట్రంలో ప్రజల ఆర్ధిక, సామాజిక వివరాలను సేకరిస్తోంది. వైకాపా చేపట్టిన సర్వే ద్వారా చంద్రబాబు నాయుడు పాలన పట్ల ప్రజలు తృప్తిగా ఉన్నారా లేదా? చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలని అన్నిటినీ అమలుచేశారా లేదా? అనే వివరాలు సేకరించడం. పనిలో పనిగా ప్రజలని ముఖ్యమంత్రి ఏవిధంగా మోసం చేస్తున్నారో వివరించడం కూడా దాని లక్ష్యం. దాని కోసం వంద ప్రశ్నలతో కూడిన ఒక ప్రశ్నా పత్రం కూడా తయారుచేశారు.

ప్రభుత్వం మొదలుపెట్టిన సర్వేలో సాంకేతిక ఇబ్బందుల కారణంగానే జాప్యం జరుగుతోంది. అది అధికారిక కార్యక్రమం కనుక కొంచెం ఆలస్యమైనా తప్పకుండా పూర్తవుతుంది. ఇంత హటాత్తుగా ప్రభుత్వం సర్వే ఎందుకు నిర్వహిస్తోంది? ఆ అవసరం ఏమిటి? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ సర్వే ద్వారా ప్రజలని ఫిల్టరింగ్ చేసి సంక్షేమ పధకాల ఆర్ధిక భారం తగ్గించుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని ఆరోపిస్తున్నాయి. ఏ ప్రభుత్వమైనా సంక్షేమ పధకాలను వినియోగించుకొంటున్న అనర్హులని ఏరివేయడం కోసమే ఇటువంటి సర్వేలు నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే ఉద్దేశ్యంతో ఈ సర్వే నిర్వహిస్తోందని భావించవచ్చు. కనుక ప్రతిపక్షాల అనుమానాలు కూడా సహేతుకమేనని భావించవచ్చు.

అయితే రాష్ట్ర ఐటి, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి దీని గురించి చాలా విచిత్రంగా మాట్లాడారు. ఈ సర్వే నిర్వహిస్తే ప్రజలకి ఎక్కడ సంక్షేమ పధకాలు అందిపోతాయనే భయంతోనే ప్రతిపక్షాలు దానిపై అభ్యంతరాలు, విమర్శలు చేస్తున్నాయని అన్నారు.

ప్రభుత్వం సంక్షేమ పధకాలు అమలు చేస్తానంటే ఎవరు కాదనరు. భయపడాల్సిన పని లేదు. కానీ వాటిని తొలగిస్తుందనే ప్రజలు భయపడుతున్నారు. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కానీ మంత్రిగారు దానికి తెదేపా స్టైల్లో బాష్యం చెప్పారు. తమ ప్రభుత్వం చేస్తున్న సర్వేని ఎవరూ వేలెత్తి చూపకూడదనుకొంటారు. కానీ వైకాపా మొదలుపెట్టిన గడప గడపకి వైకాపా కార్యక్రమంపై తెదేపా నేతలందరూ మూకుమ్మడిగా విమర్శలు చేస్తుంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close