“దేశంలో ఏదైనా భారీ కార్యక్రమం నిర్వహించాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది చంద్రబాబునాయుడు” అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమరావతి శంకుస్థాపన సభలో ప్రశంసించారు. ఆయన నమ్మకాన్ని నిజం చేస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖలో ప్రపంచ రికార్డు స్థాయిలో నిర్వహించారు. నెల రోజుల ముందుగా సన్నాహాలు ప్రారంభించి.. ఓ ఫ్లోలో .. ప్రజల్లో యోగాపట్ల అవగాహన పెంచుతూ .. స్వయంగా ప్రజలు భాగస్వామ్యం అయ్యేలా చేయడంలో సక్సెస్ల అయ్యారు. రెండున్నర కోట్ల మంది యోగాలో భాగమయ్యారంటే.. చిన్న విషయం కాదు.
ప్రజా భాగస్వామ్యం కల్పించడం చంద్రబాబు స్టైల్
యోగా అనేది అద్భుతమైన ఆరోగ్య ప్రక్రియ. ప్రపంచానికి భారత్ అందించిన వారసత్వ సంపద. ఆధునిక జీవన కాలంలో యోగా అవసరం ఎక్కువగా ఉంది. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విశాఖ వేదిక కావడంతో చంద్రబాబు అవకాశాన్ని సంపూర్ణంగా వినియోగించుకున్నారు. ప్రజంలదరూ యోగాలో భాగమయ్యేలా ప్రత్యేకంగా ప్రణాళిక సిద్ధం చేశారు. యోగాంధ్రకు రూపకల్పన చేసి నెల రోజుల పాటు ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు.. వారినీ భాగస్వాములయ్యేలా చేశారు. యోగాలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా రిజిస్టర్ చేసుకున్నవారే. బలవంతంగా చేయించడం వల్ల సోల్ ఉండదని నమ్ముతారు.
ఆరోగ్యాంధ్రకు యోగాంధ్ర కీలకమైన అడుగు
హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. చాలా మంది ఆ వెల్త్ కోల్పోయే వరకూ గుర్తించరు. ఆ తర్వాత ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సంపాదించిన అసలైన వెల్త్ కోల్పోవాల్సి వస్తుంది. ప్రజల ఆరోగ్య బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. ప్రజాఆరోగ్యం బాగోలేకపోతే ప్రభుత్వంపైనా ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ప్రభుత్వాలు ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాలి. ఈ విషయంలో గత ప్రభుత్వాలతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వానికి ప్రత్యేకమైన విజన్ ఉంది. ప్రజల్లో అవగాహన పెంచి ఆరోగ్యకరకమైన లైఫ్ను లీడ్ చేసేందుకు గైడ్ చేస్తున్నారు. అందులో భాగంగా యోగాంధ్రను పకడ్బందీగా ఉపయోగించుకున్నారు.
మరింత పకడ్బందీగా నారా లోకేష్ పర్యవేక్షణ
విశాఖ యోగాంధ్ర విజయవంతానికి చంద్రబాబు ప్రణాళిక సిద్ధం.. నారా లోకేష్ పర్యవేక్షించారు. ఇరువురి నాయకత్వంలో యోగా ఇప్పుడు తెలుగు ప్రజలు.. ముఖ్యంగా సామాన్యుల్లోనూ ఓ చర్చనీయాంశ కార్యక్రమం అయింది. మంచి ఆరోగ్యం కోసం యోగా చేయాలన్న అవగాహన పెరిగింది. ఈ కార్యక్రమం సక్సెస్ కావడానికి.. నారా లోకేష్ సమర్థంగా పని చేశారు. మొత్తంగా టీమ్ వర్క్తో యోగాంధ్ర ప్రపంచ రికార్డు నమోదు చేసింది.