జగన్ రెడ్డి రాజకీయానికి వందల మంది జైళ్ల పాలవుతున్నారు. కేసుల పాలవుతున్నారు. కుటుంబాలను వేదనలో మిగులుస్తున్నారు. కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అందరి జీవితాలను నాశనం చేసి దాని మీదుగా జగన్ తన రాజకీయ ఆశల్ని నేరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సింగయ్య మృతి, కృష్ణంరాజు అనే వ్యక్తిని గాలికి వదిలేయడం వంటివి చూసి చాలా మంది ఇదేం పద్దుని ఆశ్చర్యపోతున్నారు. పోస్టర్ ప్రదర్శించిన రవితేజ అనే వ్యక్తి తో తమకు సంబంధం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. దీంతో జగన్ క్యారెక్టర్ పై చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
తల్లి, చెల్లినే మోసం చేసిన క్యారెక్టర్ను ఎలా నమ్ముతారు?
జగన్మోహన్ రెడ్డి అనే లీడర్ వ్యక్తిత్వ పరంగా ఎక్కడో ఉంటారు. ఆయనకు తల్లి, చెల్లిపైనే మమకారం లేదు. అలాంటప్పుడు.. కార్యకర్తలు , నేతలపై ఉంటుందని అనుకోలేరు. కానీ జగనన్న 2.0 అని నమ్మించి బలిచ్చేందుకు రెడీగా ఉంటారు. కన్నతల్లి, చెల్లి కూడా చంద్రబాబు చెప్పినట్లుగా వింటారని ప్రచారం చేసిన వ్యక్తి ఆయన. అలాంటి మనస్థత్వం ఊహించడం కష్టం. చెల్లికి అక్రమంగా సంపాదించిన ఆస్తుల్లో వాటా ఇవ్వాల్సి వస్తుందని దూరం చేసుకున్నారు. తండ్రికి మాట ఇచ్చి కూడా.. ఇవ్వలేదని అబద్దం చెబుతున్నారు. సుబ్బారెడ్డి లాంటి వాళ్లతో కూడా షర్మిలపై అబద్దాలు చెప్పించారంటే ఆయన మనస్థత్వం ఏ లెవల్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
తప్పులు చేయించి… తమకు సంబంధం లేదని చెప్పే వ్యక్తిత్వం
వైసీపీ కార్యకర్త రవితేజ.. జగన్ రెడ్డి మానసిక ఆనందం కోసం రప్ప ..రప్ప నరుకుతాం అనే పోస్టర్లు వేసుకుని ఆయన ముందు నిలబడ్డారు. ఆయన జైలు పాలు అయితే.. ఇన్సూరెన్స్ కోసం తీసుకున్న టీడీపీ సభ్యత్వం కార్డును చూపించి.. ఆయన టీడీపీ కార్యకర్తే అని వదిలించేసుకున్నారు. కనీస న్యాయసాయం చేయడం లేదు. ఓ కార్యకర్తను తొక్కి చంపేశారు. మరో కార్యకర్త చనిపోతే పట్టించుకున్న దిక్కు లేదు. కేవలం పావులుగా వాడుకుని.. తప్పులు చేయించి.. తమకు సంబంధం లేదని తప్పించుకుంటున్నారు. ఇప్పటికే పలువురు నేతలు, ఐఏఎస్లు.. ఐపీఎస్లు జగన్ కోసం పని చేసి జైళ్లకు వెళ్తున్నారు. వారితోనూ తమకు సంబంధం లేదన్నట్లుగా జగన్ , వైసీపీ వ్యవహరిస్తున్నారు. వారంతా టీడీపీ కార్యకర్తలన్నట్లుగా చెబుతున్నారు.
లీడర్, క్యాడర్ ఆలోచించుకోవాల్సిన సమయం
వైసీపీ అధినేత జగన్ రెడ్డిని నమ్ముకుంటే.. కుటుంబాలతో సహా సర్వనాశనం అవడం ఖాయం. దానికి ఉదాహరణాగ ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. జైలు పాలయినా నేతలు.. ఆర్థికంగా చితికిపోయిన నేతలు ఎదురుగానే ఉన్నారు. అందరిపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి.. ఎటూ కాకుండా ఉన్నా నేతలు ఎదురుగా ఉన్నారు. వారందర్నీ చూసి అయినా మిగిలిన ఉన్న లీడర్, క్యాడర్ అర్థం చేసుకుని.. బతుకుల్ని మార్చుకుంటే బెటర్. లేకపోతే.. కర్కోటకుడి రాజకీయ జీవితానికి బలి పశువులుగా మారాల్సిందేనన్న నిర్వేదం కనిపిస్తోంది.