నాయకులను బట్టే పాలన ఉంటుంది. పాలనను బట్టే రాష్ట్ర ఎజెండా ఉంటుంది. ఆ విషయం ఏపీలో మరోసారి నిరూపితమవుతోంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల పాటు ఎప్పుడూ అభివృద్ధి, పరిశ్రమలు అనే మాటే వినిపించలేదు. అరెస్టులు, నేరాలు, ఘోరాలు, పరిశ్రమలను తరిమేయడం, లిక్కర్ , ఇసుక స్కాంలే హైలెట్ అయ్యాయి. ఇప్పుడు ఏడాదిలోనే మార్పు వచ్చింది. పెద్ద పెద్ద పరిశ్రమలు ఏపీకి వస్తున్నాయి. ఉపాధి పెరిగింది. అమరావతి, పోలవరం పరుగందుకున్నాయి. పూర్తిగా ఎజెండానే మారిపోయింది.
ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్స్ అభివృద్ధి, సంక్షేమం
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశమయ్యే అంశాలు అభివృద్ధి, సంక్షేమం. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ అభివృద్ధి గురించే మాట్లాడుతున్నారు. రాష్ట్రం మొత్తం నాశనమైపోయిన రోడ్లు బాగయ్యాయి. మౌలిక సదుపాయాలు పెరిగాయి. విద్యా వ్యవస్థ మెరుగుపడింది. రాజధాని పట్టాలెక్కింది. పోలవరం పనులు జోరుగా సాగుతున్నాయి. టోటల్ ఎజెండా మారిపోయింది. ఎక్కడైనా అభివృద్ధి పనులు ఆలస్యమైతే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఫలానా చోట పనులు జరగడం లేదంటున్నారు. పలానా పని చేయాలని కోరుతున్నారు. సంక్షేమంలోనూ కూటమి ప్రభుత్వం తమదైన ముద్ర వేసింది. తల్లికి వందనం స్కీమ్ను ఊహించనంతగా సక్సెస్చ చేసింది.
జగన్ పాలనలో విధ్వంసమే హైలెట్
జగన్ రెడ్డి పాలనలో మొదటి ఏడాది కాదు.. మొత్తం.. ఐదు సంవత్సరాల పాటు విధ్వంసమే హెడ్ లైన్స్ గా ఉండేవి. సీఎంగా మొదటి సారి కలెక్టర్లతో మాట్లాడి..కూర్చున్న కొమ్మనే ఇరుక్కున్న చందంగా.. ఆయన ప్రజావేదికను కూలగొట్టించారు. అప్పటి నుంచి ప్రారంభమైన పాలన.. కక్ష సాధింపులు, అవినీతి, దోపిడీ, అడ్డగోలు రాజకీయాలతోనే సాగింది కానీ ఎక్కడా ప్రజా కోణంలో జరగలేదు. ఒక్క నాడైనా.. రాజధాని, పోలవరం లేదా అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రస్తావన చేసి.. ఇదిగో ఇలా సాధించామని చెప్పుకునే పరిస్థితి లేదు. ఓ ప్రాజెక్టు కట్టలేదు.
ప్రజలకు స్పష్టంగా తెలుస్తున్న తేడా !
యువకుడు అని ఓ చాన్సిచ్చారో.. కులరాజకీయాలు చేసి జగన్ ట్రాప్ చేశారో కానీ 2019లో ఆయనకు ఓ చాన్స్ వచ్చింది. దాన్ని దుర్వినియోగం చేశారు. ప్రజలను పట్టి పీడించారు. అసలు నాయకుడు అంటే ఎలా ఉండకూడదో తెలిసేలా చేశారు. ఈ అంశంలో ప్రజలకు స్పష్టత వచ్చింది. ఎవరి ప్రాధాన్యతలు ఏమిటో ప్రజలు తెలుసుకున్నారు. ఎవరు అధికారంలో ఉంటే.. ఎలాంటివి జరుగుతాయో.. ప్రజలకూ స్పష్టత వస్తోంది. విధ్వంస కారులకు తగిన బుద్ది చెబుతున్నారు.