కల్వకుంట్ల కవిత ఒత్తిడిలో ఉన్నారు. తండ్రే రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తున్నారని ఫీలవుతున్నారో.. లిక్కర్ స్కామ్లో జైలుకెళ్లాల్సి వచ్చిందని మథనపడుతున్నారో కానీ ఏం చేస్తున్నారో ఆమెకే అర్థం కావడం లేదు. బీఆర్ఎస్ లో ఉన్నానంటారు.. జాగృతి పేరుతో రాజకీయాలు చేస్తున్నారు.. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటారు.. మళ్లీ పార్టీని నడపడం చేతకాదురా బై అని విమర్శిస్తూంటారు. వీటితో పాటు ఇప్పుడు తెలంగాణ మళ్లీ ఉద్యమం సమయంలో తండ్రి చేసిన రెచ్చగొట్టుడు వ్యూహాలతో ఇప్పుడు మరోసారి ప్రజల్ని పిచ్చోళ్లను చేద్దామనుకుంటున్నారు.
అందుకు ఆమె ఎంచుకున్న మార్గం బిర్యానీ. ఆంధ్ర పేరుతో మళ్లీ రాజకీయాలు ప్రారంభించి.. తెలంగాణ అస్థిత్వం అంటూ మాట్లాడుతున్నారు. ఫోన్లు చేసినప్పుడు జై తెలంగాణ అనాలని కూడా పిలుపునిచ్చారు. కవిత అలా అంటున్నారో లేదో ఎవరికీ తెలియదు. ఆ పాత పద్దతులకు పిలుపునివ్వడమే కాకుండా.. ఆంధ్రా బిర్యానీ గురించి కామెంట్లు ప్రారంభించారు. ఆంధ్రా బిర్యానీ ఎట్లుంటదో కేసీఆర్ గారు చెప్పిండని వెకిలి నవ్వు నవ్వారు. కవిత మాట్లాడిన విధానం.. ఆంధ్రాపై విషం చిమ్మి మళ్లీ తమ రాజకీయ పబ్బం గడుపుకోవాలన్న ఆశను చూసి చాలా మమంది పాపం కల్వకుంట్ల కవిత అనుకుంటున్నారు.
తెలంగాణ ప్రజలకు స్వరాష్ట్రం వచ్చి పదకొండేళ్లు అయింది. కేసీఆర్ కు పదేళ్లు అధికారం ఇచ్చారు. కేసీఆర్ ఫ్యామిలీ వేల కోట్లు సంపాదించుకుందని.. తెలంగాణ ప్రజలకు ఏమైనా ఒరిగిందో లేదోనని అదరికీ డౌటే. ఇక్కడ చాలదన్నట్లుగా కవిత ఢిల్లీలో లిక్కర్ స్కాంలో ఇరుక్కున్నారు. అన్నీ పోగా ఇప్పుడు మళ్లీ ఆంధ్రా బిర్యానీ అంటున్నారు. ప్రజలు ఇలాంటివి విని, ఇలాంటి పిలుపులకు ఉద్రేకపడే రోజులు పోయాయి. వారి రాజకీయ ఎజెండాను తెలుసుకుని అసహ్యించుకునే రోజులు వచ్చాయని కవిత గుర్తించకపోవడం .. అధికారదాహంతో వారం చేస్తున్నారో తెలియని స్థితికి దిగజారిపోవడాన్ని సూచిస్తోందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు.