జగన్ రెడ్డి పెద్దగా ఖర్చు లేకుండా ప్రజా ఉద్యమం చేయాలనుకుని క్యూ ఆర్ కోడ్ విధానాన్ని ఆలోచించారు. ఎవరు ఈ ఆలోచన చెప్పారో కానీ.. రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ కార్యకర్తలు ఓ పాంప్లెట్ పట్టుకుని ఇంటింటికి వెళ్లినట్లుగా.. వెళ్లి వాళ్ల ఫోన్ ను తీయించి.. తాము చూపించే క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేయాలని అడగాల్సి ఉంటుంది. ఎవరైనా ఇలా తాము చూపించే క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేయమంటే భయపడతారు. ఎందుకంటే ఇది ఆన్ లైన్ ఫ్రాడ్ల స్కాం. తెలియని క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే మొత్తం ఫోన్ లో సమాచారం సేకరించే కేటుగాళ్లు వచ్చేశారు.
వైసీపీ నేతలంతా అసాంఘికశక్తులే. లోకల్ గా ఉండే జులాయిలే ఎక్కువగా వైసీపీ పార్టీలో ఎక్కువగా ఉంటారు. పైగా జగన్మోహనరెడ్డి వారినే ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. వారే ఇంటింటికి వెళ్లాల్సి ఉంటుంది. వారిని చూస్తేనే జనం దూరంగా పోతారు. అలాంటిది వారు వచ్చి క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయమంటే ఎవరూ నమ్మరు. ఈ క్యాంపెయిన్ ఘోరంగా ఫెయిలయ్యే అవకాశాలు ఉంటాయి.
అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఖర్చుతో గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించేవారు. వాలంటీర్లు, మందీ మర్భలాన్ని వెంటేసుకుని వెళ్లేవారు. అక్కడ జరిగిన మంచిని చెప్పడానికి ఇలాంటి క్యూ ఆర్ కోడ్ ను వాడలేదు. ఓ పాంప్లెట్ ఇచ్చేవారు. కానీ అందులో అన్నీ తప్పుడు సమాచారం ఉండేది. ఇవ్వకపోయినా ఇచ్చినట్లుగా చెప్పేవారు. తమకు ఇచ్చినట్లుగా రాసుకుని కొట్టేశారని ప్రజలు భావించారు. ఇప్పుడు అంత ఖర్చుపెట్టలేరు కాబట్టి.. క్యూ ఆర్ కోడ్ విధానాన్ని అనుకున్నారు. కానీ ఇది ఎంత తెలివి తక్కువ నిర్ణయమో.. కార్యకర్తలకు ప్రారంభం కాకుండానే అర్థమవుతోందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.