కాకాణి గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ చేసి పెద్ద ఎత్తున డబ్బులు కూడబెట్టారు. అలా వసూలు చేసిన డబ్బులను కుమార్తె అకౌంట్లోకి జమ చేయించారు. నెల్లూరులో అత్యంత విలాసంగా ఇంటిని నిర్మించారు. వాటి కోసం పెద్ద ఎత్తున డబ్బులు వెచ్చించారు. ఆ డబ్బుల లెక్కలు ఇప్పుడు పోలీసులు అడుగుతూంటే తనకు తెలియదని ఆయన చెబుతున్నారు.
అక్రమ మైనింగ్ లో తెరపై కనిపిస్తున్న నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి ఖాతా నుంచి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె ఖాతాకు 70 లక్షలు జమ అయ్యాయి. ఎందుకు జమ చేశారని కాకాణిని ప్రశ్నిస్తే.. తన కూతురుతో తనకు సంబంధం లేదని ఆయన చెబుతున్నారు. పెళ్లి చేసి పంపించాలని ఆమె వ్యాపారాలు ఆమెదని అంటున్నారు. ఆ డబ్బు లంచం డబ్బేనని కుమార్తె ఖాతాలోకి జమ చేయించాలని స్పష్టమైన ఆధారాలున్నా.. కుమార్తెను ఇరికించడానికి ఆయన వెనుకాడలేదు.
అలాగే నిరంజన్ రెడ్డి… సింగపూర్ నుంచి కాకాణి ఇంటి కోసం పెద్ద ఎత్తున ఇంటీరియర్ తెప్పించారు. అది కోట్లలో ఉంటుంది. నిరంజన్ రెడ్డి తాను కాకాణికి ఎలా డబ్బులిచ్చాను..ఏమి తెప్పించాను అన్నది పోలీసులకు చెప్పారు. ఆ బిల్లులు కూడా ఉన్నాయి. వాటిని కాకాణి ఇంటి కోసం వాడారని కళ్ల ముందే ఉంది. అయితే కాకాణి మాత్రం .. నిరంజన్ రెడ్డితో సంబంధంలేదని.. అంటున్నారు. మరి ఆయన ఎందుకు ఇంటీరియర్ కోట్లు ఖర్చు పెట్టి తెచ్చి ఇచ్చారన్నది మాత్రం చెప్పడంలేదు.
అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా దోచుకున్న కాకాణి దొరికిపోయే సరికి ఏం చేయాలో తెలియక కుమార్తెనూ ఇరికిస్తున్నారు. వైసీపీ నేతల ధనదాహం.. దొరికిన తర్వాత తాము తప్పించుకునేందుకు కుటుంబసభ్యుల్ని బలి పశువుల్ని చేసేదుకు వెనుకాడని వైనం అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి.