తెలంగాణ జాగృతి విస్తరణను కల్వకుంట్ల కవిత చాలా సీరియస్ గా తీసుకున్నారు. జాగృతి లీడర్లకు శిక్షణా కార్యక్రమాలతో పాటు విదేశాల్లో కూడా విస్తరిస్తున్నారు. కొత్తగా పలు దేశాలకు జాగృతి కన్వీనర్లను నియమించారు. వారంతా ఆయా దేశాల్లో నివాసం ఉండేవారే. ఇప్పటి వరకూ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవారే. అధికారికంగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటున్నారు ..ల కానీ జాగృతి నేతలు అవుతున్నారు. కవిత కూడా బీఆర్ఎస్ పార్టీ నేతనే అలాగే జాగృతి రాజకీయం కూడా సొంతంగా చేసుకుంటున్నారు.
బీఆర్ఎస్ పార్టీ నేతలు కవిత చేపట్టే కార్యక్రమాల్లో కనిపించడం లేదు. కానీ కవిత మాత్రం మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు. కవిత కూడా బీఆర్ఎస్ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. నిజం చెప్పాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎలాంటి పోరాట కార్యక్రమాలు చేపట్టడం లేదు. పూర్తిగా వ్యక్తిగత అంశాలతో రాంగ్ ట్రాక్ లో ఉంది. ఆ గ్యాప్ ను కవిత ఫిల్ చేస్తూ…. తానే పోరాటం చేస్తున్నానన్న అభిప్రాయం కల్పిస్తున్నారు.
కవిత జాగృతిని క్రమబద్ధంగా విస్తరించుకుంటున్నారు. జాగృతిలో చేరే వారు.. జాగృతి కార్యక్రమాలను తెరపైకి తీసుకెళ్లేవారు అందరూ బీఆర్ఎస్ పార్టీ సానుభూతిపరులే అవుతారు. దాని వల్ల బీఆర్ఎస్ పార్టీకే ముప్పు వస్తుంది. కవిత విషయాన్ని బీఆర్ఎస్ కు ఎలా డీల్ చేయాలో అర్థం కావడం లేదు. ఆ పరిస్థితినే కవిత అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు.