కెసిఆర్ బాటలో చంద్రబాబు నాయుడు నడుస్తున్నారా?

మంచి పనులు ఎవరు చేసినా వారిని స్వాగతించాలి. వారిని ప్రేరణగా తీసుకొని ఇతరులు కూడా మంచి పనులు చేస్తే వారినీ మెచ్చుకోవలసిందే. తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయని కేంద్రప్రభుత్వంతో సహా దేశంలో చాలా రాష్ట్రాలు మెచ్చుకొంటున్నాయి. దానిని అమలుచేయడానికి ప్రయత్నాలు మొదలుపెడుతున్నాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. అయితే రెండు ప్రభుత్వాల మధ్య, వాటిని నడిపిస్తున్న తెదేపా, తెరాసల మధ్య నెలకొన్న విభేధాల కారణంగా తెలంగాణా ప్రభుత్వ ప్రేరణతోనే చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పుకోవడం లేదని భావించవచ్చు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చాలా కాలం క్రితమే చెరువుల పూడిక తీసే కార్యక్రమం మొదలుపెట్టింది. ఆ కారణంగా రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. ఇక నుంచి చెరువులతో బాటు, వాగులు, వంకలలో కూడా యుద్ధప్రాతిపదికన పూడికతీత పనులని, చెరువులని అనుసంధానం చేసే పనులు కూడా మొదలుపెట్టాలని ముఖ్యమంత్రి అధికారులని ఆదేశించారు. సాధారణంగా ఇటువంటి పనులన్నీ వేసవి కాలంలోనే పూర్తిచేస్తుంటారు. కానీ ఇప్పుడు వర్షాలు మొదలయిన తరువాత చెరువులలో పూడిక తీయడం అంటే చాలా కష్టం..దాని కోసం ప్రభుత్వం అధనంగా డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. కనుక వచ్చే ఏడాదిలోనైనా చెరువుల పూడికతీత పనులని ఒక ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తే మంచిది.

అలాగే రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా పోటాపోటీగా చేపట్టాయి. అది చాలా మంచిపనే. కాకపోతే తెలంగాణాలో ఆ కార్యక్రమంలో ప్రజలని ఎక్కువగా భాగస్వాములుగా చేస్తుంటే, ఎపిలో ప్రభుత్వమే ఆ పని చేసుకుపోతోంది. ఇటువంటి కార్యక్రమాలు విజయవంతం అవ్వాలంటే ప్రజల సహకారం తప్పనిసరి.

మంచి పనులే కాదు అప్రజాస్వామిక, అనైతికమైన పార్టీ ఫిరాయింపుల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు తన శిష్యుడు కెసిఆర్ మార్గంలోనే ముందుకు సాగుతున్నారు. ఆ విషయంలో ఇద్దరూ చాలా చెడ్డపేరు, విమర్శలు మూటగట్టుకొన్నారు. కానీ ఆ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు కంటే కెసిఆరే తను అనుకొన్నది సాధించారని చెప్పకతప్పదు. శత్రుశేషం, రుణశేషం ఉండకూడదంటారు పెద్దలు. ఆ ప్రకారమే కెసిఆర్ రాష్ట్రంలో తెదేపాతో సహా ప్రతిపక్ష పార్టీలని అన్నిటినీ దాదాపు నిర్వీర్యం చేసే వరకు వాటిని వదిలిపెట్టలేదు. కానీ ఈ విషయంలో చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని చెప్పక తప్పదు. 20మంది వైకాపా ఎమ్మెల్యేలని తెదేపాలోకి ఫిరాయింపజేసినప్పటికీ, నేటికీ వైకాపా అంతే బలంగా నిలిచి ఉంది. పైగా ఇంకా గట్టిగా తెదేపా ప్రభుత్వాన్ని ఎదుర్కొంటోంది. అది విసురుతున్న సవాళ్ళని ఎదుర్కోలేక తెదేపా చాలా ఇబ్బందిపడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close