ఆశ్చర్య పరుస్తున్న నాగార్జున కీలక ప్రకటన !

వెండి తెర మన్మధుడు నాగార్జున రేపు సాయంత్రం తాను ఒక కీలక ప్రకటన చేయబోతున్నానని తెలపడం ప్రస్తుతం టాలీవుడ్ షాకింగ్ న్యూస్ గా మారింది. దీనితో నాగార్జున రేపు సాయంత్రం ఏ విషయం పై కీలక ప్రకటన చేయబోతున్నాడు అనే అంచనాలు అప్పుడే ప్రారంభం అయిపోయాయి.

కొందరు మితిమీరిన ఉత్సహంతో నాగార్జున తన పిల్లలు నాగచైతన్య అఖిల్ పెళ్ళి వ్యవహారం పై స్పందించ బోతున్నాడు అంటూ మరో ఊహాగానాలకు తెర తీసారు. అయితే ఫిలింనగర్ లోవినపడుతున్న వార్తల ప్రకారం నాగార్జున స్పందించ బోతున్నది తాను ప్రత్యేక పాత్రలో నటించిన ‘నిర్మలా కాన్వెంట్’ సినిమా గురించి అని తెలుస్తోంది. ఈమధ్య ఈసినిమాకు సంబంధించి షూటింగ్ జరుగుతున్న సమయంలో నాగార్జున ఈసినిమా సెట్ లో అసహనంగా ఈసినిమా స్క్రిప్ట్ పేపర్లను గాలిలోకి విసిరే అంత కోపం తనకు ఎందుకు వచ్చిందో ఈ కీలక ప్రకటనలో తెలియచేస్తాడని టాక్.

ఇప్పటికే ఈసినిమా టీజర్ కు మంచి స్పందన వచ్చిన నేపధ్యంలో ఈ సినిమా పై భారీ అంచనాలు పెరుగుతున్నాయి. హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా పరిచయం అవుతున్న ఈసినిమాను నాగార్జున స్వయంగా నిర్మిస్తూ ఉండటంతో ఈ ‘నిర్మలా కాన్వెంట్’ ను స్వయంగా నాగ్ ప్రమోట్ చేసి భారీ లాభాలను పొందడానికి రేపు సాయంత్రం మీడియా ముందుకు వస్తూ ఈ సినిమా ప్రమోషన్ ను చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి..

తనుష్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మరోసారి అభాసుపాలైన హరీష్ ..!!

సీఎం రేవంత్ రెడ్డికి ఇటీవల వరుస సవాళ్ళు విసిరి నవ్వులపాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హారీష్ రావు మరోసారి అభాసుపాలు అయ్యారు. రిజర్వేషన్ల విషయంలో ఢిల్లీ పోలీసులు నోటిసులు ఇచ్చారని, ఆలస్యం చేయకుండా రేవంత్...

ఓటేస్తున్నారా ? : పోలవరం వైపు ఓ సారి చూడండి !

ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కరువులో నిండా మునిగిపోవాలో.. కనీసం రైతుల కడుపు నింపుకోవాలో తేల్చుకోవాల్సిన సంధి స్థితిలో ఉంది. ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధమయ్యారు. గతంలో ఓట్లు వేశారు. ఐదేళ్లలో ఏం...

ఏది నైతికత… ఏది అనైతికత ..!?

రిజర్వేషన్లపై అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేశారనే ఆరోపణలతో కాంగ్రెస్ సోషల్ మీడియా టీంకు నోటిసులు జారీ చేయడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రిజర్వేషన్ల విషయంలో తమపై అభాండాలు వేస్తున్నారని గగ్గోలు పెడుతోన్న...

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close