ఏపి బంద్ తో తెదేపా కనిపెట్టినదేమిటంటే…

ప్రతిపక్ష పార్టీలు నిన్న నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ బంద్ విఫలం అయ్యిందని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. దానితో జగన్మోహన్ రెడ్డికి ప్రజల మద్దతు లేదనే విషయం స్పష్టం అయిపోయిందని అన్నారు. పిల్ల కాంగ్రెస్ బంద్ కి పిలుపునిస్తే మరో ఆలోచన లేకుండా తల్లి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని అన్నారు. దానితో ఆ రెండు పార్టీల మద్య రహస్య అవగాహన ఉందనే సంగతి బయటపడిందని అన్నారు. పార్లమెంటు లోపల, బయటా తెదేపా సభ్యులు ఆందోళన చేస్తే వాటిని డ్రామాలని అంటున్న జగన్మోహన్ రెడ్డే ప్రత్యేక హోదా పేరుతో డ్రామాలాడుతూ ప్రజలని వంచిస్తున్నారని విమర్శించారు.

ఏపి బంద్ విఫలం అయ్యిందని తెదేపా, విజయవంతం అయ్యిందని వైకాపా వాదించుకొంటున్నాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి బంద్ నిర్వహిస్తే అది విజయవంతం అవుతుందని వేరేగా చెప్పనవసరం లేదు. ఏపిలో నిన్న 2,539 బస్సులు తిరుగలేదని, విద్యా, వ్యాపార సంస్థలు మూతపడటం వలన రాష్ట్రానికి చాల నష్టం వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా నిన్న చెప్పారు. అంటే బంద్ విజయవంతం అయ్యిందని ఆయనే దృవీకరిస్తున్నారన్న మాట. కనుక బంద్ విఫలం అయ్యిందని యనమల చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. కానీ ఈ బంద్ నిర్వహించడం వలన రాష్ట్రానికి చాలా నష్టం జరిగిందనే ముఖ్యమంత్రి మాటలు నూటికి నూరు శాతం నిజమని అంగీకరించక తప్పదు.

ఈ బంద్ తో మంత్రి యనమల కనిపెట్టిన తల్లీపిల్ల కాంగ్రెస్ అనుబందం కూడా కొత్త విషయమేమీ కాదు. రాష్ట్ర విభజన కారణంగా రాష్ట్రంలో తుడిచిపెట్టుకు పోయిన కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికి గత రెండేళ్లుగా చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అందుకే మరో ఆలోచన లేకుండా జగన్ కి మద్దతు ఇచ్చింది.

ప్రత్యేక హోదా కోసం తెదేపా ఎంపిలు మాత్రమే కాదు వైకాపా ఎంపిలు కూడా పార్లమెంటు లోపలా బయటా ఆందోళనలు చేస్తున్నారు. ఒకవేళ తెదేపా ఆడుతున్నవి నాటకాలు అని వైకాపా ఆరోపిస్తే, వైకాపా ఆడుతున్నవి కూడా నాటకాలే అవుతాయి. తెదేపా, వైకాపా, కాంగ్రెస్ మూడూ ప్రత్యేక హోదా కోసమే పార్లమెంటు లోపలా బయటా పోరాడుతున్నప్పటికీ, ఎన్నడూ కలిసి పోరాడవు. ఎవరి పోరాటం వారిదే. అందుకే డిల్లీ పలకులకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, పార్టీలు అంటే అంత చులకన.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close