ఖైదీ ట్రైల‌ర్ : మెగా ఫ్యాన్స్‌కి పండ‌గ‌

చిరంజీవి అభిమానుల‌కు వారం ముందే సంక్రాంతి పండ‌గ వ‌చ్చేసింది. చిరు త‌న ఖైదీ నంబ‌ర్ 150 ట్రైల‌ర్‌ని పండ‌గ గిఫ్ట్‌గా ముందే ఇచ్చేశాడు. గుంటూరులోని హాయ్‌లాండ్‌లో జ‌రిగిన ఖైదీ నెం150 ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో ట్ర‌యిల‌ర్ ఆవిష్క‌రించారు. ‘బాస్ ఈజ్ బ్యాక్‌’ అనే ట్యాగ్‌లైన్ కి న్యాయం చేస్తూ..ఈ ట్రైల‌ర్‌లో అంతా చిరు హంగామానే క‌నిపిస్తోంది. డాన్సులు, త‌న‌దైన మేన‌రిజం, మాస్ డైలాగులు, క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్‌తో ఆక‌ట్టుకొన్నాడు చిరంజీవి. సినిమా సంగ‌తేమో గానీ… ట్రైల‌ర్ మాత్రం చిరు వ‌న్ మ్యాన్ షోలానే మారిపోయింది. ‘పొగ‌రు నా ఒంట్లో ఉంది.. హీరోయిజం నా ఇంట్లో ఉంది’ అంటూ మెగా అభిమానుల కోసం ఓ డైలాగ్ వ‌దిలాడు చిరు.

ఎంపైర్ ఆఫ్ ఎంట‌ర్‌టైన‌ర్ అనే ట్యాగ్ లైన్ కి సార్థ‌క‌త చేకూరేలా.. చిరు ఈ సినిమాతో నూటికి నూరు శాతం వినోదం అందించ‌డం గ్యారెంటీ అనిపిస్తోంది. క‌త్తి సినిమా చూసిన‌వాళ్ల‌కు ఈ ట్రైల‌ర్.. ‘కాపీ పేస్ట్‌’ అన్న‌ట్టే అనిపించొచ్చు. రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చూసీ చూసీ విగిసిపోయిన‌వాళ్ల‌కు ఖైదీ కూడా ఆ తానులో ముక్కే అనిపించొచ్చు. కానీ చిరు ఎలాంటి సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వాల‌ని అభిమానులు ఆశించారో… క‌చ్చితంగా వినాయ‌క్ అలాంటి సినిమానే తీశాడ‌నిపిస్తోంది. నిర్మాణ విలువ‌లు హై రేంజ్‌లో ఉన్నాయి. కొన్ని కీల‌క స‌న్నివేశాల్ని క‌త్తిలో ఉన్న‌ట్టుగానే యాజ్ ఇట్ ఈజ్ దించేసిన‌ట్టు క‌నిపిస్తున్నా… సినిమా మాత్రం చిరు అభిమానుల్ని మెప్పించేలా ఉండ‌బోతోంద‌న్న‌ది అర్థ‌మ‌వుతోంది. సో.. మెగా అభిమానులు పండ‌గ చేసుకోవ‌డానికి రెడీ అయిపోవొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close