బాబుగారి క‌టింగులు.. ముంబైలో!

అవ‌స‌రాల శ్రీ‌నివాస్ న‌టించిన తాజా చిత్రం ‘బాబు బాగా బిజీ’ ఇప్పుడు ఇబ్బందుల్లో ప‌డింది. అడ‌ల్ట్ కంటెంట్ ఉన్న కార‌ణంగా ఈ సినిమాని సెన్సార్ చేయ‌డానికి ప్రాంతీయ సెన్సార్ బోర్డు నిరాక‌రిస్తోంద‌ని స‌మాచారం. బాలీవుడ్‌లో సెక్సీ సినిమాగా పేరొందిన `హంట‌ర్‌`కి రీమేక్ ఇది. మాతృక‌లోనే అడ‌ల్ట్ కంటెంట్ భారీ స్థాయిలో ఉంటుంది. రీమేక్ లో ఆ డోసు ఇంకాస్త పెరిగింద‌ని తెలుస్తోంది. మ‌రీముఖ్యంగా నాలుగైదు స‌న్నివేశాల ప‌ట్ల సెన్సార్ బోర్డు తీవ్ర అభ్యంత‌రం తెలిపింద‌ని టాక్‌. ఆ స‌న్నివేశాల్ని తొల‌గించ‌డం గానీ, లేదంటే.. బ్ల‌ర్ చేయ‌డం గానీ చేస్తే త‌ప్ప సెన్సార్ అనుమ‌తి వ‌చ్చే అవ‌కాశం లేదు. అందుకే… ఇప్పుడు చిత్ర‌బృందం ఓ ప్లాన్ వేసింది. ఈ సినిమాని ముంబైలో సెన్సార్ చేయాల‌ని నిర్ణ‌యించుకొన్నార్ట‌.

ముంబైలో సెన్సార్ నిబంధ‌న‌లు కాస్త స‌ర‌ళంగానే ఉంటాయి. బూతు స‌న్నివేశాల్ని కూడా చూసీ చూడ‌నట్టు వ‌దిలేస్తారు. అందుకే వివాదాస్ప‌ద చిత్రాలు, అడ‌ల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలూ అక్క‌డ సెన్సార్ జ‌రుపుకొంటాయి. సెన్సార్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఓ సినిమాని ఎక్క‌డైనా సెన్సార్ చేసుకోవొచ్చు. ముంబైలో అయితే.. సెన్సార్ ఈజీగా అయిపోతుంద‌ని. `ఏ` స‌ర్టిఫికెట్‌తో, క‌టింగులేమీ లేకుండా సినిమాని విడుద‌ల చేసుకోవొచ్చ‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. అందుకే ఇప్పుడు సెన్సార్ కోసం ముంబై వెళ్ల‌బోతున్నాడు ఈ బాబు. సో… బాబు గారి క‌ష్టాల‌న్నీ తొల‌గిపోయిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close