ఒకే హోదా-ఒకే పెన్షన్ పై మాజీ సైనికుల అసంతృప్తి

మాజీ సైనికుల నాలుగు దశాబ్దాల పోరాటం నేటికి ఫలించింది. ఈరోజు రక్షణ మంత్రి మనోహర్ పర్రికర్ ఏప్రిల్ 1,2014 నుండి ఈ నూతన పెన్షన్ విధానం వర్తింపజేస్తామని ప్రకటించారు. కానీ గత మూడు నెలలుగా దీని కోసం డిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరాహర దీక్షలు చేస్తున్న మాజీ సైనికులు ఈ ఒకే హోదా-ఒకే పెన్షన్ స్వాగతించినప్పటికీ, ఇంకా ఆరు అంశాలపై కేంద్రప్రభుత్వం తమ అభ్యర్ధనలను మన్నించకపోవడాన్ని నిరసిస్తూ తమ దీక్షను కొనసాగించాలని నిర్ణయించుకొన్నారు.

ఈ పెన్షన్ విధానం స్వచ్చందంగా పదవీ విరమణ చేసినవారికి వర్తించదనే షరతుపై వారు అభ్యంతరం తెలుపుతున్నారు. ప్రతీఏట అనేక వేలమంది సైనికులు, సైనికాధికారులు వివిధ కారణాల చేత స్వచ్చందంగా పదవీ విరమణ తీసుకొంటుంటారు. కనుక వారికి ఈ పెన్షన్ విధానం వారికి వర్తింపజేయకపోవడం అన్యాయమని వారు వాదిస్తున్నారు. దీనిని అందరికీ వర్తింపజేయాలని వారు కోరుతున్నారు.

అదే విధంగా ప్రతీ ఐదేళ్ళకు ఒకసారి పెన్షన్ పెంచలన్న కేంద్రప్రభుత్వం నిర్ణయాన్ని కూడా వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రతీ మూడేళ్లకి ఒకసారి పెంచాలని వారు పట్టుబడుతున్నారు. ఈ విధానంలో లోటుపాట్లను, మాజీ సైనికుల అపరిష్కృత పిర్యాదులను, సమస్యలపై 6 నెలలకు ఒకసారి కేంద్రప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు ఏక సభ్య కమిటీని ఏర్పాటుపై కూడా కూడా వారు అభ్యంతరం చెపుతున్నారు. ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి దానిలో మాజీ సైనికుల ప్రతినిధులను కూడా సభ్యులుగా నియమించాలని వారు కోరుతున్నారు. రక్షణ మంత్రి క్రింద ఆ కమిటీ పనిచేయాలని, ఆరు నెలలకొకసారి కాకుండా ప్రతీనెలా రక్షణ మంత్రికి కమిటీ నివేదిక ఇస్తుండాలని వారు కోరుతున్నారు. తమ అభ్యంతరాలను కేంద్రప్రభుత్వం పరిష్కరించేవరకు తమ పోరాటం కొనసాగిస్తామని వారు తెలిపారు. వారి డిమాండ్స్ లో కమిటీ ఏర్పాటుపై కేంద్రప్రభుత్వం పునః పరిశీలిస్తుందని రక్షణ మంత్రి హామీ ఇచ్చారు. మిగిలిన విషయాలను చర్చల ద్వారా పరిష్కరించుకొందామని, కనుక తక్షణమే తమ దీక్షలు నిలిపి వేయాలని ఆయన మాజీ సైనికులను కోరారు. ఈ నూతన పెన్షన్ విధానం వలన సుమారు 22 లక్షల మంది మాజీ సైనికులు మరో 6 లక్షల మంది మాజీ సనికుల వితంతువులకి లబ్ది కలుగుతుందని మంత్రి తెలిపారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close