మోడీ అవినీతి పరుడా? కాదా?

2014 ఎన్నికల సమయంలో నరేంద్రమోడీ, చంద్రబాబుల పొత్తు మొగ్గ తొడిగిన తర్వాత నుంచీ టిడిపి జనాలు, ఆ పార్టీ అనుకూల మీడియా, పవన్ కళ్యాణ్….ఇంకా టిడిపి భజన బృందంలో ఉన్న చాలా మంది మోడీని ఆకాశానికెత్తేశారు. వెంకయ్యనాయుడి లాంటి భజన రాయుడిని కూడా మించిపోయి ఇష్టారీతిన మోడీని పొగిడేసి దేవుడ్ని చేసిపడేశారు. మోడీకంటే ఎంతో సీనియర్ అయిన చంద్రబాబే సాగిలపడిన తర్వాత ఇక బాబు భజన బృందానికి వేరే ఛాయిస్ ఎలా ఉంటుంది? శశికళను జైలుకు పంపించినప్పుడు అవినీతిపైన ఉక్కుపాదం మోపుతున్న మోడీ అనే స్థాయిలో వార్తలు రాశారు. ఇక ప్రస్తుతం దేశం మొత్తం మీద ఉన్న ఎక్కువ మంది నాయకులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మోడీతో సయోధ్య కోసం ప్రయత్నాలు చేస్తున్నవాళ్ళే. ప్రస్తుతానికి అత్యంత శక్తివంతుడిగా కనిపిస్తున్న మోడీ రాజకీయ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. అలాంటి మోడీతో పోరాటానికి కాలుదువ్వుతున్న నేత కేజ్రీవాల్ ఒక్కడే. కానీ ఆ కేజ్రీవాల్‌ని దేశంలోనే అత్యంత ఎక్కువ అవినీతిపరుడు అనే స్థాయిలో ఈనాడులాంటి అగ్రశ్రేణి పత్రికలు కూడా వార్తలు ప్రచురిస్తుంటే మోడీ ముందు మీడియా జనాలకు కూడా ఏ స్థాయిలో మోకరిల్లుతున్నారో అర్థమవుతూనే ఉంది. అదే సమయంలో దేశంలో ఉన్న అవినీతిని అంతమొందించడానికి దిగివచ్చిన దేవుడిగా మోడీని కీర్తించడంలో కూడా ఏ మాత్రం తగ్గడం లేదు.

ఇఫ్పుడు ఆ దేవుడే ప్రపంచంలోనే అత్యంత పెద్ద అవినీతిపరుడని టిడిపి మీడియా చెప్పిన జగన్‌కి అపాయింట్‌మెంట్ ఇచ్చాడు. ఇద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారని సాక్షి వాళ్ళు వార్తలు వండేశారు. మోడీతో జగన్ మీటింగ్‌లో తప్పేముందని బిజెపి నేతలు టిడిపి నేతలకు కౌంటర్స్ ఇస్తున్నారు. తనపై ఉన్న కేసులు కొట్టివేయించుకోవడానికి మోడీ కాళ్ళపైన పడ్డాడు జగన్ అని టిడిపి నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఆంధ్రజ్యోతిలో వస్తున్న వార్తలకు అయితే అంతూ పొంతూ లేదు. విమర్శలన్నీ కూడా జగన్‌పైనే ఎక్కుపెడుతున్నారు కానీ మోడీని విమర్శించే ధైర్యం మాత్రం ఎవ్వరూ చేయలేకపోతున్నారు. ఒక అవినీతిపరుడు వెళ్ళి కాళ్ళపైన పడినంత మాత్రాన అతనిపై ఉన్న కేసులన్నింటినీ మాఫీ చేసేస్తాడా మోడీ? అంటే శశికళ మోడీ కాళ్ళపైన పడలేదు కాబట్టే జైలుకు పంపించాడా? ఓటుకు నోటు కేసు విషయంలో కూడా మోడీ కాళ్ళపైన పడ్డారు కాబట్టే చంద్రబాబును వదిలేశారా? కేజ్రీవాల్ మోడీకి ఎదురు తిరుగుతున్నాడు కాబట్టే అతన్ని అవినీతి కేసుల్లో ఇరికించడానికి ప్రయత్నాలు చేస్తున్నారా? అంటే మోడీ అత్యంత పెద్ద అవినీతిపరుడు, తనకు మోకరిల్లిన వాళ్ళను రక్షించడం కోసం, ఎదురుతిరిగినవాళ్ళను శిక్షించడం కోసం వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసి మరీ మేనేజ్ చేస్తున్నవాడు అని అర్థం చేసుకోవాలా? ఇప్పుడు టిడిపి నేతలు మాట్లాడుతున్న మాటలు, టిడిపి మీడియాలో వస్తున్న వార్తలను విశ్లేషిస్తే అర్థమవుతున్న విషయం ఇదే. మరి అలాంటి మోడీని ఇదే నారా చంద్రబాబు, టిడిపి నేతలు, టిడిపి భజన మీడియా అందరూ కూడా దేశాన్ని ఉద్ధరించడానికి ధీరుడు అని ఎలా చెప్తున్నారు? ఏది నిజం? మిగతా వాళ్ళను విమర్శించే ముందు మోడీ అవినీతిపరుడా? కాదా? అనే విషయంపైన చంద్రబాబు అండ్ కో ఓ స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేస్తే బాగుంటుందేమో.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close