బిజెపిపై వైసీపీ ఆశల పల్లకి

పైకి ఏం మాట్లాడుతున్నా వైఎస్‌ఆర్‌సిపి జగన్‌ మోడీ భేటిపై మరీ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబును వదలి తమనే దగ్గర చేసుకుంటారనే ఆలోచనలో వుంది. ప్రత్యేక హౌదా విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని పదేపదే విమర్శించకుండా ఎన్నికలు దగ్గర పడిన తర్వాత రాజీనామాలు చేస్తామని లాంచనంగా ప్రకటిస్తారట. ఆ వెంటనే కేంద్రం హౌదా ఇచ్చేస్తుందట. ఇది వైసీపీ విజయంగా ప్రజలు భావిస్తారు గనక బిజెపి వచ్చి తమతో జట్టు కడుతుందట. ఇది ఆ పార్టీకి చెందిన ఒక మాజీ మంత్రి ఇచ్చిన విశ్లేషణ. ఇంతకాలం ఇవ్వని మోడీ సర్కారు ఆఖరులో మాత్రం ఎందుకు హౌదా ఇస్తుంది? తెలంగాణపై ఎక్కువ కేంద్రీకరణ చేసిన బిజెపి ఎపికి అనుకూలమైన నిర్ణయం తీసుకుంటుందా? అంటే ఔను అనే వారు చెబుతున్నారు. అవినీతిపై పోరాటం అంటూ అన్ని కేసులు ఎదుర్కొంటున్న జగన్‌తో ఎలా కలుస్తారు అంటే బిజెపి అధికారం కోసం ఏదైనా చేస్తుందని కర్ణాటకలో తమ పాత మిత్రుడైన గాలి జనార్ధనరెడ్డికి అవకాశమిచ్చిన యెడ్యూరప్పకు సర్వాధికారాలు కట్టబెట్టారు కదా అని వారు వాదిస్తున్నారు. ఇదంతా వినడానికి బాగానే వుండొచ్చు గాని తెలుగుదేశంతో స్నేహం అంటూనే రెండో వారిని చేరదీసిన బిజెపి తమ విషయంలో మాత్రం అత్యంత నిజాయితీగా వ్యవహరిస్తుందని వైసీపీ వారెందుకు భ్రమపడుతున్నారో తెలియడం లేదు. జగన్‌ను జైలుపాలు చేసి వైసీపీని తమలో కలిపేసుకుంటుందని ఆ పార్టీ వ్యతిరేకుల జోస్యంగా వుంది.అమిత్‌ షా తల్చుకుంటే ఏదైనా సాధ్యమే కదా

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవారం బాక్సాఫీస్‌: ఎన్నిక‌ల‌కు ముందూ త‌గ్గేదే లే!

మే 13న ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. నెల రోజుల ముందు నుంచే ఈ ఎల‌క్ష‌న్ ఫీవ‌ర్ టాలీవుడ్ ని తాకింది. ఆ ఎఫెక్ట్ వ‌సూళ్ల‌పై తీవ్రంగా క‌నిపిస్తోంది. వారానికి రెండు మూడు సినిమాలొస్తున్నా...

మారుతి సినిమాకి ‘భ‌లే’ బేరం!

ఈమ‌ధ్య ఓటీటీ రైట్స్ విష‌యంలో నిర్మాత‌లు తెగ బెంగ ప‌డిపోతున్నారు. ఓటీటీలు సినిమాల్ని కొన‌డం లేద‌ని, మ‌రీ గీచి గీచి బేరాలు ఆడుతున్నార‌ని వాపోతున్నారు. అయితే కొన్ని సినిమాలు మాత్రం గ‌ప్ చుప్‌గా...

జైలు నుండే సీఎం రేవంత్ కు క్రిశాంక్ సవాల్

ఉస్మానియా వర్సిటీ పేరుతో సర్క్యూలర్‌ను మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేత క్రిశాంక్ జైలు నుండే సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు. తాను...

ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పై వైసీపీ కంగారుతో ప్రజల్లో మరింత అనుమానాలు !

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా ప్రచారం అవుతోంది. ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. దీన్ని ఆపాలని జగన్ రెడ్డి పోలీసుల్ని పురమాయిస్తున్నాయి. సీఐడీ కేసునూ పెట్టించగలిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close