జగన్ డైలాగ్‌తో జగన్‌కే కౌంటరా?

జగన్ ప్రభుత్వం కాకుండా వేరే ఏ ప్రభుత్వం ఉన్నా సరే….ఆ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేయండి అని చెప్పడం జగన్‌కి బాగా అలవాటు. రాజకీయాల్లో ఉన్న ప్రతి నాయకుడికీ కూడా కొన్ని ఊతపదాలు ఉన్నట్టే….‘బంగాళా ఖాతంలో కలిపేయండి’ అన్న డైలాగ్‌ జగన్‌కి ఊతపదం. ఆ మధ్య కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేయండి అని చెప్తూ ఊరూవాడా తిరగాడు. తీరా చూస్తే జనాలు కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని నిజంగానే బంగాళాఖాతంలో కలిపేశారు కానీ జగన్‌కి షాక్ ఇస్తూ చంద్రబాబును నెత్తినపెట్టుకున్నారు. ఆ షాక్ నుంచి వెంటనే తేరుకున్న జగన్….చంద్రబాబు సిఎం అయిన తర్వాత నుంచీ చంద్రబాబు ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపెయ్యండి అంటూ పాట పాడడం మొదలెట్టాడు.

ఈ మధ్య తను చేసిన కొన్ని వ్యాఖ్యలతోనూ, కేశినేని ట్రావెల్స్‌తోనూ చంద్రబాబుకు తలనొప్పి తెప్పించిన కేశినేని నాని ఇప్పుడు బాబును ఖుషీ చేసే పనిలో పడ్డాడు. అందులో భాగంగా జగన్‌ని తిట్టడం మొదలెట్టాడు. ఊరూ పేరు…ముక్కు మొహం తెలియని వాళ్ళైనా సరే….జగన్‌ని తిడితే బాబుకు అదో ఆనందం. అందుకే ఇప్పుడు కేశినేని నాని బాబు కళ్ళలో ఆనందం చూడడం కోసం జగన్‌ని తిట్టడం మొదలెట్టాడు. అందులో భాగంగానే ‘జగన్‌ని బంగాళాఖాతంలో కలిపెయ్యండి’ అని ఆవేశంగా మాట్లాడేశాడు కేశినేని నాని. టిడిపి నేతలు ఇప్పటి వరకూ జగన్‌ని తిట్టిన తిట్లన్నింటిలో హైలైట్స్ తీస్తే ఈ ‘జగన్‌ని బంగాళాఖాతంలో కలిపెయ్యండి’ అన్న డైలాగ్ కూడా అందులో ఒకటిగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. అసలే నెక్ట్స్ ఎన్నికల్లో బాబు విజయవాడ ఎంపి సీటు ఇస్తాడా? ఇవ్వడా? అని బోలెడంత ఆందోళన చెందుతున్న కేశినేని నానికి జగన్‌పై తిట్ల వర్షం తర్వాతనైనా బాబు నుంచి ఆ హామీ దక్కుతుందేమో చూడాలి మరి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close