తెలుగు రాష్ట్రాలకు రిలీఫ్ ఇచ్చిన వర్షాలు!

హైదరాబాద్: ఉన్నట్లుండి నైరుతి రుతుపవనాలు చురుకుగా మారటంతో కురిసిన వర్షాలు తెలుగు రాష్ట్రాలు రెండింటిలో నీటి కొరతను తీర్చాయి. ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్‌లో అనేక జలాశయాలు ఇప్పుడు నీటితో కళకళలాడుతున్నాయి. శ్రీశైలం, సుంకేశుల, తుంగభద్ర రిజర్వాయర్‌లు పొంగి పొర్లుతున్నాయి. ఇటు హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, మంజీరా, సింగూర్ రిజర్వాయర్‌లలోకి భారీవర్షాల వలన పెద్దఎత్తున నీరు వచ్చి చేరుతోంది. ఇక నల్గొండ, మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపూర్ జిల్లాలలో ఈ వర్షాల పుణ్యమా అని కరవు పరిస్థితులు తొలగిపోయినట్లే. ముఖ్యంగా అనంతపూర్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో జిల్లాలోని సుమారు 175 చెరువులు ఇప్పుడు నీటితో కళకళలాడుతున్నాయి. జిల్లాలో సాధారణ వర్షపాతం 249 మి.మీ. కాగా గత మూడురోజులు కురిసిన వర్షాలతో అది 251 మి.మీ.కు చేరుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక వర్షపాతం విజయనగరం జిల్లాలోని కొమరాడ మండలంలో – 7 సెం.మీ.గా, దాని తర్వాత చిత్తూరు జిల్లాలో వెంకటగిరి కోటలో 6 సెం.మీ.గా నమోదయింది. ఇక తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ పోచలో అత్యధికంగా 10 సెం.మీ., దాని తర్వాత నల్గొండజిల్లా సూర్యాపేట మండలంలో 8 సెం.మీ. వర్షపాతాలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్‌ నగరంలో ఈ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమవటం, ట్రాఫిక్ వంటి సమస్యలు ఏర్పడుతున్నప్పటికీ, నగరానికి నీరందించే రిజర్వాయర్లు నిండుతాయని, భూగర్భ జలమట్టాలు పెరుగుతాయని ప్రజలు సంతోషపడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close