నాగ‌చైత‌న్య టైటిల్ : యుద్ధం శ‌ర‌ణం

నాగచైతన్య, లావణ్య త్రిపాఠి జంటగా వారాహి చలన చిత్రం పతాకంపై కృష్ణ ఆర్.వి.మారిముత్తు దర్శకత్వంలో రజని కొర్రపాటి నిర్మిస్తున్న చిత్రానికి “యుద్ధం శరణం” అనే టైటిల్ ను నిర్ణయించి నేడు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. చిత్రీకరణ చివరి దశలో ఈ చిత్రం టీజర్ మరియు ఆడియో విడుదల తేదీలను కూడా నిర్ణయించినట్లు చిత్ర బృందం చెబుతోంది. “పెళ్లి చూపులు” ఫేమ్ వివేక్ సాగర్ సంగీత సారథ్యం వహించనుండగా.. శతచిత్ర కథానాయకుడు శ్రీకాంత్ ఈ చిత్రంలో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రను పోషిస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి మాట్లాడుతూ.. “నాగచైతన్య కథానాయకుడిగా తెరకెక్కిన ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్ టైనర్ “యుద్ధం శరణం”. కథకి తగిన టైటిల్ ఇది. నాగచైతన్య లుక్-యాటిట్యూడ్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. శ్రీకాంత్, రావు రమేష్‌‌లు కీలకపాత్రలు పోషించనున్నారు. అలాగే.. మురళీశర్మ-రేవతీల పాత్రలు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. జూలై 15న ఫస్ట్ టీజర్ ను విడుదల చేయనున్నాం. ఇదే నెలలో ఆడియోను విడుదల చేసి.. ఆగస్ట్ లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. నాగచైతన్య కెరీర్ లో బెస్ట్ ఫిలిమ్ గా “యుద్ధం శరణం” నిలిచిపోతుందన్న నమ్మకం ఉంది” అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఊపిరి పీల్చుకున్న డబ్బింగ్ బొమ్మ

తమిళ సినిమాలు తెలుగులో తెగ అడేస్తాయి. విక్రమ్, జైలర్ విజయాల్లో తెలుగు ప్రేక్షకుల వాటానే ఎక్కువ. అయితే కొన్నాళ్ళుగా తమిళ సినిమాల సందడి తగ్గింది. ఇలా రావడం అలా వెళ్ళిపోవడమే కానీ ఒక్కటంటే...

ట్రైనీ ఐఏఎస్ గా కూతురు… ఉప్పొంగిన హృదయంతో తండ్రి సెల్యూట్

ఆ దృశ్యం... అందరినీ కదిలించింది. ఆమె విజయం.. ఆ కన్నతండ్రికి గర్వకారణమైంది. తమ పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకుంటే చూసి మురిసిపోవాలని తండ్రులందరూ భావిస్తారు. కానీ కొంతమంది తండ్రుల ఆశలు మాత్రమే...

చెవిరెడ్డి శ్రీవారి దర్శన వ్యాపారం రేంజే వేరు !

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి .. జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. జగన్ రెడ్డి సతీమణికి తన ఇంటి పక్కన గోశాల లాంటి కుటీరం కావాలని అనిపిస్తే.. అఘమేఘాల మీద కట్టేస్తాడు....

ఫర్నిచర్‌కు జగన్ డబ్బులిచ్చేస్తారట !

సీఎంగా చేసి ఫర్నీచర్‌ను కొట్టేశారని జగన్ పై వస్తున్న ఆరోపణలకు వైసీపీ స్పందించింది. ఓడిపోగానే.. ప్రజాధనంతో క్యాంప్ ఆఫీసు కోసం కొనుగోలు చేసిన వస్తువులన్నింటికీ డబ్బులిస్తామని ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామని వైసీపీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close