అభిమానులు చేసిన తప్పుకి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్తం!

ఈనెల 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా, భీమవరంలో ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బ్యానర్లను ప్రభాస్ అభిమానులు చింపి వేశారనే అనుమానంతో పవన్ కళ్యాణ్ అభిమానులు వారి ఇళ్ళపై దాడులు చేసి విద్వంసం సృష్టించారు. ఆ సందర్భంగా కొన్ని ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులకు నష్టం జరిగింది. ఆయన వీరాభిమానులమని చెప్పుకొని తిరుగుతున్నవారి ఆయన ఆశయాలను, సామాజిక స్పృహ, బాధ్యతని ఏమాత్రం పట్టించుకోకుండా విధ్వంసానికి పాల్పడి ఆయనకు తీరని అప్రదిష్ట తెచ్చారు.

ఈ గొడవపై పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఇద్దరూ ఇంతవరకు స్పందించలేదు. కానీ ఈ వ్యవహారంపై మీడియాలో వచ్చిన వార్తలు చూసిన పవన్ కళ్యాణ్, తన అభిమానుల వలన కలిగిన నష్టాన్ని భరించేందుకు ముందుకు వచ్చారు. అభిమానుల దాడిలో నష్టపోయినవారి కోసం అత్యవసరంగా ఆయన రూ.3లక్షలు పంపినట్లు భీమవరం యస్.ఐ. తెలియజేసారు. మొత్తం ఎంత నష్టం జరిగిందో అంచనా వేసిన తరువాత మిగిలిన మొత్తం కూడా పంపుతానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లు సమాచారం. అభిమానులు చేసిన తప్పుకి ఆయన మూల్యం చెల్లించవలసి వస్తోంది. ఇది ఆయన అభిమానులకు చెంప దెబ్బ వంటిదే. నిజానికి ఆయన దీనికి బాధ్యత వహించకపోయినా అడిగేవారుండరు. కానీ అది తన బాధ్యత అని పవన్ కళ్యాణ్ భావించి ఆ నష్టాన్ని భరించేందుకు ముందుకు వస్తున్నారు. కనీసం ఇప్పటికయినా ఆయన అభిమానులు తమ రియల్-లైఫ్-హీరోని ఆదర్శంగా తీసుకొని బాధ్యతగా వ్యవహరిస్తే బాగుంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీకాళహస్తి రివ్యూ : బొజ్జల వారసుడికి రెడ్ కార్పెట్ వేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే !

శ్రీకాళహస్తి రాజకీయం అంటే అందరికీ గుర్తొచ్చే పేరు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సుదీర్ఘ కాలం సేవలు అందించిన ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ ఆత్మీయుడు. శ్రీకాళహస్తికి ఓ ఇమేజ్ తెచ్చి పెట్టారు. కానీ గత...

ధర్మారెడ్డి కోసం ఆలిండియా రూల్స్ మారిపోతాయ్ !

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి మరోసారి డిప్యూటేషన్ పొడిగించారు. రిటైరయ్యే వరకూ అంటే జూన్ 30వ తేదీ వరకూ ఆయన డిప్యూటేషన్ లోనే ఉంటారు. ఇప్పటికే రెండు సార్లు...

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం బీజేపీ, బీఆర్ఎస్ వెదుకులాట!

బీఆర్ఎస్ ను చుట్టుముడుతున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. లోక్ సభ ఎన్నికలతో కిందా మీదా పడుతున్న సమయంలోనే మూడు ఉమ్మడి జిల్లాల్లో ప్రభావం చూపేలా మరో ఉపఎన్నిక వచ్చి పడింది....

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో అనుప‌మ‌

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ త‌న జోరు చూపిస్తోంది. టిల్లు స్క్వేర్‌తో హిట్టు కొట్టాక‌, ఆ ఉత్సాహం మ‌రింత‌గా పెరిగిపోయింది. వ‌రుస‌గా కొత్త సినిమాల‌పై సంత‌కాలు పెడుతోంది. తాజాగా బెల్లంకొండ శ్రీ‌నివాస్ తో జోడీ క‌ట్ట‌డానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close