టీఎస్‌పీఎస్సీ- క్యా శాలరీస్‌ హై!

తెలంగాణ, ఎపిలలో పాలకపక్షాలు రకరకాల కార్పొరేషన్ల చైర్మన్లు, సలహాదారుల పేరుతో అస్మదీయులను నియమించడం అనంతంగా సాగిపోతున్నది. ఎంఎల్‌ఎలు కాలేని ఎంఎల్‌సిలుగా అవకాశం రాని వారికి పునరావాస వేదికలుగా ఇవి గొప్పగా ఉపయోగపడుతున్నాయి. ఈ పదవులలో చాలా భాగం పైకి మామూలుగా కనిపించవచ్చు గాని నియామకాల తర్వాత వారికి భారీ పారితోషికాలు ముడుతుంటాయి. లక్షన్నర, రెండు లక్షలు ఇలా అన్నమాట. అదే కోవలో ఇప్పుడు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌, సభ్యుల జీతాలు ఏక్‌దమ్మున 281 శాతం పెరగడం విశేషం. చైర్మన్‌ జీతం 80వేల రూపాయల నుంచి 2లక్షల 25 వేలకు పెరిగింది. సభ్యుల జీతం 79 వేల నుంచి 2,24వేలకు పెరిగింది. ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి ఇప్పుడు చైర్మన్‌గానూ, విఠల్‌ తదితరులు సభ్యులుగానూ వున్న సంగతి తెలిసిందే. ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు ఈ పెరుగుదల అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రైవేటు రంగం మాట ఎలా వున్నా ప్రభుత్వాలలో ఈ పెంపుదల బాగా ఎక్కువే. సాంకేతిక కారణాలు ఏమైనా సరే ఈ పెంపుదలపై విమర్శలు బాగానే వినిపించాయి.ఈ పెంపుదల కూడా 2016 జనవరి నుంచి వరిస్తాయన్నారు గనక 19 నెలల బకాయిలూ వస్తాయట. గుడ్‌లక్‌. జీతాలు పెరిగాకనైనా కమిషన్‌ ఉద్యోగాల భర్తీపై దృష్టి పెంచితే బాగుంటుందని నిరుద్యోగ యువత కోరుతున్నది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close