చంద్ర‌బాబుది కులాలవారీ ప‌ర్య‌ట‌న‌..!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు నంద్యాల‌లో రెండో రోజు ప‌ర్య‌టించారు. మామూలుగా ఎన్నిక‌ల ప్ర‌చారం అన‌గానే, భారీ బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేసి… ఆ స‌భ‌కు పెద్ద ఎత్తున జ‌నాల్ని త‌ర‌లించ‌డం ఒకెత్తు. రోడ్ షో నిర్వ‌హిస్తూ ప్ర‌జ‌లంద‌రికీ క‌లుసుకోవ‌డం మ‌రో ఎత్తు. ఇప్పుడు చంద్ర‌బాబు మూడో ఎత్తు కూడా వేస్తున్నారు. అదేంటంటే.. కులాల వారీగా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవ‌డం! నంద్యాలలో సీఎం ప‌ర్య‌ట‌న ఇలానే సాగింది. మైనారిటీల‌తో సీఎం స‌మావేశ‌మై, వారి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. పేద‌ల‌కు ఇవ్వాల్సిన భూమిని వైయ‌స్ హాయాంలో ఒక కంపెనీకి క‌ట్టెబెట్టార‌నీ, అక్క‌డి నుంచి ఆ భూములు జ‌గ‌న్ కంపెనీల‌కు వెళ్లిపోయాయని గ‌తం గుర్తు చేసే ప్ర‌య‌త్నం చేశారు. నాడు గృహ నిర్మాణ మంత్రిగా ఉన్న శిల్పా మోహ‌న్ రెడ్డి, ఈ భూక‌బ్జాను ప‌ట్టించుకోలేద‌ని విమ‌ర్శించారు.

ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా బ‌లిజ సంఘాల‌తో సీఎం భేటీ అయ్యారు. కాపులు, బ‌లిజ‌, ఒంట‌రి, తెల‌గ కులాల అభివృద్ధికి తెలుగుదేశం ప్ర‌భుత్వం కట్టుబ‌డి ఉంద‌ని చెప్పారు. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించే ప్ర‌క్రియ జ‌రుగుతోంద‌నీ, న్యాయ‌స్థానాల నుంచి భ‌విష్యత్తులో ఎలాంటి అభ్యంత‌రాలూ వ్య‌క్తం కాకుండా ప‌టిష్ఠంగా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌నీ, ఈ విష‌యంలో ప్ర‌తిప‌క్షాలు అన‌వ‌స‌ర రాద్ధాంతాలు చేస్తున్నాయ‌ని మండిప‌డ్డారు. అన్ని కులాల నుంచీ మంచి నాయ‌కుల రావాల‌నీ, కాపుల బ‌లిజ ఒంట‌రి తెల‌గ కులాల నుంచి ఇంకా రావాల‌ని చెప్పారు. ఆర్థికంగా రాజ‌కీయంగా ఈ కులాల‌ను మ‌రింత పైకి తీసుకొచ్చేందుకు అన్ని విధాలుగా అండ‌గా ఉంటాననీ, మంజునాథ క‌మిష‌న్ రిపోర్టు త్వ‌ర‌లో వ‌స్తోంద‌నీ, కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు ఇవ్వ‌బోతున్నామ‌ని సీఎం అన్నారు.

ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ పై ఉన్న అవినీతి కేసుల్ని ప్ర‌స్థావించి, ఇలాంటి వ్య‌క్తి పెట్టిన పార్టీ అధికారంలోకి వ‌స్తే ప‌రిస్థితి ఎలా ఉంటుందో ఓసారి ఆలోచించుకోవాలంటూ ప్ర‌జ‌లకు పిలుపునిచ్చారు. శిల్పా స‌హ‌కార్ పేరుతో నిర్వ‌హిస్తున్న సంస్థ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఉంద‌ని సీఎం ఆరోపించారు. శిల్పా స‌హ‌కార్ బాధితుల‌తో భేటీ అయ్యారు. వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుని అంద‌రికీ న్యాయం చేస్తాన‌ని భ‌రోసా ఇచ్చారు. శిల్పా స‌హ‌కార్ లో ఉన్న డైరెక్ట‌ర్లంతా ఆ కుటుంబానికి చెందిన‌వారే అని చెప్పారు. ఈ స‌హ‌కార వ్య‌వ‌స్థ అంతా అవ‌క‌త‌వ‌క‌ల మ‌యం అన్నారు.

నంద్యాల ఉప ఎన్నిక సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న ఇలా సాగింది. ఈ క్ర‌మంలో కులాల వారీగా అంద‌రితో స‌మావేశాలు అవుతూ ఉండ‌టం గ‌మ‌నార్హం! ఇలా కులాలవారీ స‌భ‌లు ఈ సంద‌ర్భంలో ఎందుక‌నేది అర్థ‌మౌతూనే ఉంది. ఓటు బ్యాంకు రాజ‌కీయ‌మే క‌దా! దేశంలో కుల మ‌త ప్రాంత వ‌ర్గ వ‌ర్ణ విభేదాల‌కు అతీతంగా పాల‌కులు ఉండాల‌ని, అంద‌రినీ స‌మానంగా పాలించాల‌ని పెద్ద‌లు అంటారు. కానీ, కుల ప్ర‌మేయం లేకుండా, మ‌త ప్రాతిప‌దిక కాకుండా ఒక ఉప ఎన్నిక‌ను కూడా ప్ర‌ముఖ పార్టీలు ఎదుర్కోలేని ప‌రిస్థితి.. ప్చ్‌!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close