సానియా, హింగిస్…. యు.ఎస్. ఓపెన్ చాంపియన్స్

భారత్ కు డబుల్ ధమాకా. సానియా మీర్జా, మార్టినా హింగిస్ ల జోడీ యు ఎస్ ఓపెన్ మహిళల విభాగంలో చాంపియన్ గా నిలిచింది. మరో టైటిల్ ను సొంతం చేసుకుంది. ఇదే టోర్నీలో మార్టినా హింగిస్ లియాండర్ పేస్ తో కలిసి మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో టైటిల్ సాధించిన విషయం తెలిసిందే. ఒకే టోర్నీలో ఇద్దరు భారతీయులతో జోడీ కట్టి రెండు టైటిల్స్ గెలిచిన హింగిస్ గెలిచిన మొత్తం గ్రాండ్ స్లాం టైటిల్స్ సంఖ్య 20కి చేరింది.

ఫైనల్ మ్యాచ్ లో సానియా, హింగిస్ జోడీ అద్భుతమైన సమన్వయంతో చెలరేగి ఆడింది. ప్రత్యర్థులకు పెద్దగా అవకాశాలు ఇవ్వకుండా అలవోకగా విజయం సాధించింది. ఆస్ట్రేలియా, కజక్ స్తాన్ క్రీడాకారిణుల జోడీని 6-3, 6-3 స్కోరుతో వరుస సెట్లలో సునాయాసంగా ఓడించింది. 70 నిమిషాల్లో మ్యాచ్ ముగిసింది.

మొత్తానికి మన సానియా మీర్జా 5 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచినట్టయింది. ఇందులో మార్టినా హింగిస్ పాత్ర మరువ లేనిది. ఆమె లేకపోతే సానియా, పేస్ లకు ఇన్ని టైటిల్స్ దక్కేవే కావు. వీరిద్దరి పాలిట మార్టినా దేవత అంటే అతిశయోక్తి కాదంటున్నారు క్రీడా పండితులు. చక్కటి సమన్వయం, పరస్పర సహకారం, పోరాట స్ఫూర్తి, విజయ కాంక్ష, స్నేహపూర్వక వాతావరణంలో ప్రాక్టిస్ చేయడం వంటి లక్షణాల వల్ల మార్టినా మనవాళ్లకు సరైన జోడీ అయింది. డబుల్స్, మిక్స్ డ్ డబుల్స్ జోడీ అంటే ఇలా ఉండాలనిపించేలా జోడీ కుదిరింది. మొత్తానికి సానియా మీర్జాకు యు ఎస్ ఓపెన్ లో అత్యద్భుతమైన విజయం సొంతమైంది. విజయగర్వంతో శంషాబాద్ లో అడుగు పెట్టబోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సుకుమార్ కుమార్తెకు దాదా ఫాల్కే అవార్డ్

డైరెక్టర్ సుకుమార్‌ కుమార్తె సుకృతి వేణి సినీ రంగప్రవేశం చేసింది. ఆమె ప్రధాన పాత్రలో న‌టించిన చిత్రం గాంధీ తాత చెట్టు. ఈ చిత్రాన్ని గ‌తంలో ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ప్రద‌ర్శించారు....

టీంమిండియాకి ‘ముంబై ఇండియన్స్’ కలవరం

కొత్త కుర్రాళ్ళతో టీ20 ప్రపంచకప్ బరిలో దిగుతుందని భావించిన భారత క్రికెట్ జట్టు.. అనూహ్యంగా సీనియర్లతోనే సరిపెట్టుకుంది. 2022 టీ20 ప్రపంచకప్‌లో పోటీపడిన జట్టులో ఎనిమిది మందికి మరోసారి అవకాశం వచ్చిందంటే.. ఈ...

‘లాపతా లేడీస్’ రివ్యూ: దారితప్పి మార్గం చూపిన పెళ్లి కూతుళ్ళు

'ధోబీ ఘాట్' లాంటి విలక్షణమైన సినిమా తీసిన కిరణ్ రావు, దాదాపు దశాబ్ద విరామం తర్వాత 'లాపతా లేడీస్' కోసం మళ్ళీ మెగాఫోన్ పట్టుకున్నారు. ఆమె దర్శకత్వంలో అమీర్ ఖాన్ నిర్మించిన ఈ...

టాలీవుడ్‌ ‘మే’ల్కొంటుందా?

2024 క్యాలెండ‌ర్‌లో నాలుగు నెల‌లు గ‌డిచిపోయాయి. ఈ వ్య‌వ‌ధిలో తెలుగు చిత్ర‌సీమ చూసింది అరకొర విజ‌యాలే. ఏప్రిల్ అయితే... డిజాస్ట‌ర్ల‌కు నెల‌వుగా మారింది. మే 13తో ఏపీలో ఎన్నిక‌ల హంగామా ముగుస్తుంది. ఆ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close