జంపింగుల విషయంలో వైకాపా జాగ్ర‌త్త ప‌డిందా..?

నంద్యాల ఉప ఎన్నిక‌, కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల త‌రువాత టీడీపీ ఓ ప్ర‌చారానికి తెర తీసింది. ప్ర‌తిప‌క్ష పార్టీ వైకాపా నుంచి టీడీపీకి భారీగా వ‌ల‌స‌లు ఉండబోతున్న‌ట్టు నాయ‌కులు లీకులు ఇచ్చారు. కొంత‌మంది నేత‌లు త‌న‌లో ఫోన్ లో ట‌చ్ లో ఉంటున్నార‌నీ, వైకాపాలో ఉండ‌లేమ‌ని త‌న‌తో చెబుతున్నారంటూ ఈ మ‌ధ్య‌నే మంత్రి అచ్చెన్నాయుడు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే, అస‌లు వ్యూహ‌మంతా రాయ‌ల‌సీమ కేంద్రంగా టీడీపీ అమ‌లు చేస్తోంద‌నే చెప్పాలి. ఆ ప్రాంతం నుంచి వీలైనంత మంది వైకాపా నాయ‌కుల్ని ఆక‌ర్షించాల‌ని అనుకుంటోంది. దీన్లో భాగంగా కొంత‌మంది మంత్రుల‌కు ఈ బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్టు కూడా క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే, ఈ క్ర‌మంలో వైకాపా ఎంపీ బుట్టా రేణుక తెలుగుదేశం పార్టీలో చేరే అవ‌కాశం ఉన్న‌ట్టు క‌థ‌నాలు వ‌చ్చాయి. ఆమెతోపాటు మ‌రో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ మాజీ ఎమ్మెల్యే కూడా వైకాపాకి రామ్ రామ్ చెప్పేస్తారంటూ వినిపించింది.

ఈ క‌థ‌నాల‌పై రేణుక స్పందించారు. తాను వైకాపాలోనే కొన‌సాగుతాన‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. పార్టీ అధినేత జ‌గ‌న్ తో త‌న‌కు ఎలాంటి విభేదాలూ లేవ‌ని, ఇవ‌న్నీ కావాల‌నే ఓ ప‌థ‌కం ప్ర‌కారం కొంత‌మంది చేయిస్తున్న ప్ర‌చారం అంటూ కొట్టిపారేశారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరుతా అనే క‌థ‌నాలు క‌ల్పితాలు అంటూ ఆమె ఖండించారు. దీంతో బుట్టా రేణుక‌పై వ‌స్తున్న క‌థ‌నాల‌కు ఇక‌పై ఫుల్ స్టాప్ ప‌డుతుంద‌ని అనుకోవ‌చ్చు. ఇదే త‌రుణంలో అనంత‌పురం జిల్లాకు చెందిన వైకాపా ఎమ్మెల్యే గురునాథ రెడ్డి కూడా టీడీపీలో చేర‌బోతున్న‌ట్టు క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే, ఈ విష‌యం జ‌గ‌న్ వ‌ర‌కూ వ‌చ్చిందనీ, ఆయ‌న‌తో ఓ కీల‌క నేత చ‌ర్చించార‌ని కూడా అంటున్నారు! త్వ‌ర‌లో అనంత‌పురంలో చేప‌ట్ట‌నున్న యువ‌భేరి కార్య‌క్ర‌మంలో ఆ జిల్లా నేత‌ల‌తో జ‌గ‌న్ స‌మావేశం అవుతార‌నీ, నాయ‌కుల మ‌ధ్య విభేదాల‌పై ఆ సంద‌ర్భంగా చ‌ర్చించి, ఒక తాటిపైకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం జ‌రుగుతుంద‌ని చెబుతున్నారు. దీంతోపాటు సీమ ప్రాంత ఎమ్మెల్యేల అంద‌రిపైనా ఓ క‌న్నేసి ఉంచార‌నీ స‌మాచారం!

మొత్తానికి, వ‌ల‌సల విష‌యంలో వైకాపా కాస్త జాగ్ర‌త్త‌ప‌డ్డ‌ట్టుగానే క‌నిపిస్తోంది. బుట్టా రేణుక విష‌య‌మై చాన్నాళ్లుగా క‌థ‌నాలు వ‌స్తున్నాయి. కానీ, ఆమె ఇప్ప‌టివ‌ర‌కూ నిర్ద్వంద్వంగా ఇలా ఖండించింది లేదు. రేణుక తాజా స్పంద‌న వెన‌క పార్టీ సూచ‌న‌లూ స‌ల‌హాలూ ఉండే ఉంటాయనే కొంత‌మంది అంటున్నారు. ఇంకోప‌క్క‌, గురునాథ రెడ్డి విష‌యంలోనూ వైకాపా కాస్త జాగ్ర‌త్త‌గా ఉంద‌నే అనిపిస్తోంది. అయితే, జ‌గ‌న్ పాద‌యాత్ర మొద‌ల‌య్యేలోపు కొంత‌మందినైనా వైకాపా నుంచి బ‌య‌ట‌కి తెద్దామ‌నేదే టీడీపీ ల‌క్ష్యంగా పెట్టుకుంద‌ట‌! మ‌రి, వైకాపా నుంచి మొద‌లైన ఈ బుజ్జ‌గింపులు, ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు ఆ పార్టీ నేత‌ల్ని అధికార పార్టీవైపు వెళ్ల‌నీయ‌కుండా ఎంత‌వ‌ర‌కూ క‌ట్ట‌డి చేస్తాయో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close