ర‌జ‌నీ, క‌మ‌ల్‌ల స్టామినా ఇంతేనా..?

త‌మిళ‌నాట రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం సృష్టిస్తార‌ని ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్‌ల వైపు ఆశ‌గా చూస్తోంది ప్ర‌జానీకం. త‌మిళ నాట మార్పు.. ర‌జ‌నీతో సాధ్యం అవుతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు బ‌ల్ల‌గుద్ది చెబుతోంటే.. క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌భావమూ ఎంతో కొంత త‌ప్ప‌కుండా ఉంటుంద‌ని ఆయ‌న అభిమానులు చెబుతున్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో ర‌జ‌నీ, క‌మ‌ల్‌ల పార్టీలు హ‌వా గ‌ట్టిగానే ఉండ‌బోతోంద‌ని అక్క‌డ కీల‌క‌మైన పార్టీనేత‌లు కూడా కాస్త భ‌య‌ప‌డుతున్నారు. అయితే… ప్ర‌ముఖ న‌టుడు, క‌మ‌ల్ సోద‌రుడు చారు హాస‌న్ మాత్రం రాబోయే ఎన్నిక‌ల్లో ర‌జ‌నీ, క‌మ‌ల్ లు ఏం చేయ‌లేర‌ని జోస్యం చెప్పారు. వీరిద్ద‌రూ క‌ల‌సి క‌నీసం ప‌ది శాతం ఓట్లు కూడా రాబ‌ట్టుకోలేర‌ని తేల్చేశారు. స్వ‌యంగా క‌మ‌ల్ సోద‌రుడు ఈ వ్యాఖ్య‌లు చేయ‌డంతో… అక్క‌డ చారుహాస‌న్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి.

”నాకున్న అనుభ‌వం, ప‌రిశీల‌న‌తో ఆలోచిస్తే… ర‌జ‌నీ, క‌మ‌ల్ ఇద్ద‌రికీ క‌లిపి క‌నీసం ప‌దిశాతం ఓట్లు కూడా రావు. ఓటరు రాజ‌కీయ నాయ‌కుల‌కు ఓట్లు వేస్తారు.. సినిమా వాళ్ల‌కు కాదు” అని తేల్చేశారు. క‌మ‌ల్ ఓ పార్టీ ప్ర‌క‌టించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న ఈ త‌రుణంలో కుటుంబ స‌భ్యుల నుంచే ఇలాంటి వ్యాఖ్య‌లు వినాల్సిరావ‌డం క‌మ‌ల్‌ని బాధించేదే. ఇది వ‌ర‌కు గౌత‌మి కూడా క‌మ‌ల్ రాజ‌కీయాల్లోకి అడుగుపెడితే త‌న ఓటు క‌మ‌ల్‌కి ప‌డ‌దు అని గ‌ట్టిగానే చెప్పింది. ఇప్పుడు చారు హాస‌న్ వంతు వ‌చ్చింది. ”రాజ‌కీయాల్లో రాణించాలంటే పేరు, హోదా, ఆద‌ర‌ణ‌, అభిమానంతో పాటు ఇంకా చాలా కావాలి. ఆ ఇంకా ఏమిటో నాక్కూడా తెలీదు” అని ఇటీవ‌ల రాజనీకాంత్ వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు చారు హాస‌న్ మాటలు కూడా అలానే ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.