ఎన్టీఆర్ కోసం ప‌వ‌న్ వ‌స్తున్నాడు

మా హీరో తోపు అంటే మా హీరో గ్రేటు అనుకోవ‌డం అభిమానుల వ‌ర‌కే. క‌థానాయ‌కుల మ‌ధ్య స‌ఖ్య‌త బాగానే క‌నిపిస్తుంటుంది. ఓ హీరో ఫంక్ష‌న్‌కి మ‌రో హీరో హాజ‌రు కావ‌డం సాధార‌ణ‌మైపోయింది. ఇదంతా చూసినా అభిమానుల మ‌ధ్య గొడ‌వ‌లు త‌గ్గ‌డం లేదాయె. ఇప్పుడు మ‌రోసారి హీరోలు త‌మ మ‌ధ్య ఉన్న స్నేహాన్ని చాటుకోబోతున్నారు. ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్క‌నుంది. హారిక హాసిని సంస్థ నిర్మిస్తోంది. సోమ‌వారం హైద‌రాబాద్‌లో ఈ చిత్రం లాంఛ‌నంగా ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాకి క్లాప్ కొట్ట‌డానికి స్వ‌యంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌స్తున్నాడు. త్రివిక్ర‌మ్ – ప‌వ‌న్‌ల మ‌ధ్య ఉన్న స్నేహం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. దాని కోస‌మే ప‌వ‌న్ ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌త్యేక అతిథిగా రాబోతున్నాడు. ఈ విష‌యాన్ని హారిక హాసిన సంస్థ కూడా అధికారికంగా ప్ర‌క‌టించింది. బాద్ షా సినిమా ప్రారంభోత్స‌వానికి రామ్ చ‌ర‌ణ్ వ‌చ్చిన సంగ‌తి గుర్తుండే ఉంటుంది. ఇటీవ‌ల జై ల‌వ‌కుశ హిట్ట‌యిన త‌ర‌వాత కూడా… చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌లు ఓ పార్టీ చేసుకొన్నారు. ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ క్లాప్ కొట్ట‌డానికి వ‌స్తున్నాడు. మెగా కాంపౌండ్ మొత్తం… ఎన్టీఆర్‌కి ద‌గ్గ‌ర‌వుతున్న‌ట్టే క‌నిపిస్తోంది మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నార్త్ కు మోడీ ప్రాధాన్యత…దక్షిణాదిలో బీజేపీకి ఓట్లు రాలేనా..?

మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీజేపీ ఉత్తరాది రాష్ట్రాలకే ప్రాధాన్యత ఇస్తోందని, దక్షిణాది రాష్ట్రాలను విస్మరిస్తోందని విమర్శలున్నాయి. బడ్జెట్ కేటాయింపులు , కేంద్ర మంత్రివర్గ శాఖలు.. ఇలా ఎలా చూసినా నార్త్...

ఓటేస్తున్నారా ? : బోడిగుండుగా మారిన రుషికొండను గుర్తు చేసుకోండి !

చంద్రబాబు హయాంలో ఐదు వందల కోట్లు పెట్టి సచివాలయ భవనాలు, అసెంబ్లీని నిర్మించారు. అవి ట్రాన్సిట్ భవనాలు. ఐకాన్ బిల్డింగ్స్ కట్టడానికి పునాదులు వేసే సరికి జగన్ వచ్చి కూర్చున్నారు. ఈ ఐదేళ్లలో...

ఇక నుంచి కోవిషీల్డ్ వ్యాక్సిన్ బంద్… ఎందుకంటే..?

కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీ సంస్థ ఆస్ట్రాజెనెకా ఇక నుంచి టీకాను ఉత్పత్తి చేయబోమని స్పష్టం చేసింది. కరోనాను ఎదుర్కొనేందుకు సమర్ధవంతమైన టీకాలు అందుబాటులోకి వచ్చినందున ఇక తమ వ్యాక్సిన్ అవసరం లేదని...

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close