రంగ‌స్థ‌లం.. ఎమోష‌న్స్ పీక్స్‌

సుకుమార్ అంటేనే… లాజిక్కుల‌తో మ్యాజిక్ చేసే ద‌ర్శ‌కుడు. ఆర్య‌, ఆర్య 2, 100% ల‌వ్‌… ఈ సినిమాల‌న్నీ సుక్కు లాజిక్కుల కెపాసిటీ ఏమిటో చూపించాయి. వ‌న్ – నేనొక్క‌డినే అయితే పీక్స్ అనుకోవాలి. అయితే సుకుమార్‌లో ఎమోష‌న‌ల్ యాంగిల్ కూడా ఉంద‌ని నాన్న‌కు ప్రేమ‌తో చూస్తే అర్థం అవుతుంది. ఈ సినిమాలో లాజిక్కులు ఉన్నా… వాటితో పాటు స‌మానంగా ఎమోష‌న్స్ క‌నిపిస్తాయి. ఇప్పుడు రంగ‌స్థ‌లంలోనూ ఇలాంటి మ్యాజిక్కే చేయ‌బోతున్నాడు సుకుమార్‌. రంగ స్థ‌లం అన‌గానే ఇదో ప్ర‌యోగాత్మ‌క సినిమా అనుకొన్నారంతా. కానీ… పూర్తి క‌మ‌ర్షియ‌ల్ పంథాలో సుక్కు ఈ సినిమా తీయ‌బోతున్నాడ‌ని తేలిపోయింది. సుక్కు శైలి ఫ‌న్‌, ల‌వ్ స్టోరీ ఈక‌థ‌లో బాగా మేళ‌వించాడ‌ని తెలుస్తోంది. ఎమోష‌న్స్ అయితే పీక్స్‌లోకి తీసుకెళ్లాడ‌ట‌. కొన్ని కొన్ని స‌న్నివేశాలు గుండె బ‌రువెక్కేలా సాగాయ‌ని, కుటుంబ ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమాని ద‌గ్గ‌ర చేయ‌డంలో ఈ సీన్స్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తాయ‌ని తెలుస్తోంది. క్లైమాక్స్ కూడా డిఫ‌రెంట్‌గా రాసుకొన్నాడ‌ట సుకుమార్. అక్క‌డ కూడా యాక్ష‌న్ పార్ట్‌ని బాగా తగ్గించి, ఎమోష‌న్స్‌కి ప్రాధాన్యం ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి చ‌ర‌ణ్ నుంచి రాబోతున్న ఓ డిఫ‌రెంట్ సినిమా ఇద‌న్న సంగ‌తి అర్థ‌మైపోతోంది. దానికి త‌గ్గ‌ట్టే చ‌ర‌ణ్ గెట‌ప్ కూడా కొత్త‌గా క‌నిపిస్తోంది. అదే కొత్త‌ద‌నం క‌థ‌లోనూ ఉండి, ఎమోష‌న్స్ వ‌ర్కవుట్ అయితే… చ‌ర‌ణ్ ఖాతాలో మ‌రో హిట్ ప‌డిపోయిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close