వ్య‌వ‌సాయానికి 24గంట‌లు ఉచిత విద్యుత్‌… కెసియార్‌

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం రైతుల‌కు మేలు చేసే సంచ‌ల‌నాత్మ‌క నిర్ణ‌యం తీసుకుంది. దేశంలోనే ఎవ‌రూ ఇవ్వ‌ని విధంగా తాము వ్య‌వ‌సాయానికి 24గంట‌ల ఉచిత విద్యుత్ ఇవ్వ‌నున్నామ‌ని తెలంగాణ సిఎం కెసియార్ ప్ర‌క‌టించారు. కొన్ని రోజుల పాటు ప్ర‌యోగాత్మ‌కంగా దీన్ని అమ‌లు చేసిన త‌ర్వాత వ‌చ్చే ర‌బీ నుంచి నిరంత‌ర ఉచిత విద్యుత్ అందిస్తామ‌ని తెలిపారు. తెరాస స‌భ్యుల హ‌ర్ష‌ధ్వానాల మ‌ధ్య ఆయ‌న ఈ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. రాష్ట్రం విద్యుత్ ఉత్ప‌త్తిలో అనూహ్య ప్ర‌గ‌తి సాధించిందని ఆయ‌న గ‌ణాంకాల‌తో వివ‌రించారు. స‌బ్‌స్టేష‌న్ల సంఖ్య‌ను బాగా పెంచామ‌ని, విద్యుత్ ఉత్ప‌త్తి ప్లాంట్ల‌ను ఏర్పాటు చేశామ‌ని తెలిపారు.

తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ పై చ‌ర్చ సంద‌ర్భంగా బుధ‌వారం కెసియార్ ఈ ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన‌ట్టుగా గాని నిరాటంకంగా విద్యుత్ స‌ర‌ఫ‌రా చేయ‌డం అంటూ జ‌రిగితే అది తెలంగాణ రైతుల‌కు త‌ప్ప‌కుండా మేలు చేసేదే అవుతుంది అన‌డంలో సందేహం లేదు.

రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌కు గాను విప్ల‌వాత్మ‌క రీతిలో మిష‌న్ కాక‌తీయ చేప‌ట్టింది తెలంగాణ స‌ర్కార్‌. ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన మిష‌న్ కాక‌తీయ స‌త్ఫ‌లితాలు ఇస్తున్న‌ట్టు స‌మాచారం అందుతోంది. దీని వ‌ల్ల గ‌త ఏడాదితో పోలిస్తే సాగు భూమి విస్తీర్ణం పెరిగింద‌ని తెలంగాణ మంత్రి హ‌రీష్‌రావు వెల్ల‌డించారు. రాష్ట్రంలో వ్య‌వ‌సాయం మీద ఆధార‌ప‌డిన‌ రైతుల ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగానే ఉన్న నేప‌ధ్యంలో తెలంగాణ స‌ర్కార్ చేప‌డుతున్న ఉప‌శ‌మ‌న చ‌ర్య‌లు అవ‌స‌ర‌మైన‌వే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close